ప్ర థ మా శ్వా స ము.
145
తే .గీ. లోకదీపకు రవి నతిలోకతేజు | మిత్రు సర్యముఁ బరమపవిత్రు బూషు సూ
ర్య సంజ్ఞేశ్వరు నుషేశు జూపుచుండ్రు|కడఁగి కొందరు బ్రహ్మాండకర్త యనుచు.13
క. ధరఁ గొంద ఱింద్రు డందురు | మఱికొందరు వరుణు డండ్రు మానక యితరుల్
కరివదనుఁ డండ్రు కొందరు మరు డందు రజాండకర్త మతిమంతు లొగిన్. 14
తే.గీ. వనజరిపుఁ డండ్రు కొందరు వహ్ని యండ్రు కొందరు కుబేరుడందురు కొందరు యము
డందు రీరీతినుండగ నాత్మవిదులు భగవతి నజాండకర్త్రిగాఁ బలుకుచుండ్రు. 15
వ. మఱియు నద్దేవి యీశ్వరి యనియు, నిర్గుణ యనియు, సగుణ యనియు, వైష్ణవి యనియు,
శాంకరి యనియు, బ్రాహ్మి యనియు, వానవి యనియు, వారుణి మనియు, వారాహి
యనియు, నారసింహి యనియు, మహాలక్ష్మి యనియు, వేదమాత యనియు, నేక యనియు,
విద్య యనియు, స్థిర యనియు నానావిధంబులగు నామములం గొనియాడఁబడుచు,
భక్తులకోరికల సమకూర్చుచు, మోక్షార్థులకుం బునర్భవభయంబు లడంచుచు, ఫలార్డులకు
ఫలంబు లిచ్చుచు, నిర్గుణయయ్యు సగుణయై, నిర్వికల్పమై, నిత్యప్రకాశినియై, త్రిగుణా
తీతయై , మాయకు లోఁబడక నిరంజన నిర్వికారాది తత్వంబుల నుల్లసిల్లి, యరూపమై,
నిర్లేపమై యొప్పు బ్రహ్మ తానయై ప్రకాశించునని పెద్దలు సెప్పుదు రదియుంగాక సహస్ర
శీర్షుండై సహస్రాక్షుండై సహస్రకరుండై సహస్రకర్ణుండై సహస్రముఖుండై యలరు
విరాట్టును దానయై యుండునని బ్రహ్మవిదులు కొందఱు పలుకుదురు. మరికొందరు
నిరీశ్వరవాదులు జగంబునకుం గర్తకావలసినది లేదందురు . ఇఁకఁ గొందఱు స్వభా
వంబె కారణం బందురు. ప్రకృతి యనియుఁ బ్రధాన మనియు సాంఖ్యులు సెప్పుదురు.
కావున నాహృదయంబు నానావిధ సందేహంబులకు నిఱవై మిగుల బాధనొందుచున్న
యది, నేనేమిసేయుదు, ధర్మాధర్మంబులు రెండును నా కొక్కరూపుగాఁ దోచుకున్న
యవి. ధర్మాధర్మంబులు వేరుసేయు లక్షణంబులు ప్రత్యక్షంబునఁ గానరాకయున్నయవి.
సత్వాది గుణంబుల నించి సత్వగుణంబులం దేజరిల్లు దేవతలకు దానవులచే నానావిధముల
ప్రతిబంధంబులు ప్రాపించుకున్నయవి ధర్మమంద నిలిచి సదాచారపరులగు పాండవులకు
బహువిధ దుఃఖంబులు సంభవించుట యెరుంగమే. అదికతంబునం జేసి నా సంశయంబులు
నివారింప నీపుతక్క నన్యుఁ డోపుఁవాడులేడు . జ్ఞానంబను మంచియోడపై నెక్కించి
సంసారంబను సముద్రంబు దాటునట్లు చేసి నన్నుం గటాక్షింపవే యనుఁడుఁ గరుణార్ద్ర
హృదయుండై నారదుఁడు నాకుం జెప్పె నెట్లనిన. 16
-: దేవీభాగవతావతరణము :-
తే.గీ. వ్యాస! మును నాకు నీసందియంబ కల్గి । జనకుఁడగు ధాతఁ జేరంగఁజని యడిగితి
నాయనా జగ మేరీతి నాయె మొదలఁ | గర్తనీవొ కపర్డియో గరుడహయుఁడో. 17