ద్వి తీ య స్కం ధ ము.
141
తే.గీ వారల కతండు మీకగువాడుసుమ్ము దారుణంబైన శాపంబు దలగజేయ
ననిన విధిమాటలకు గడు నాత్మ నలరి | వాసుకియు మునిగ వనముజేరి.380
క. భగినీ సనామక నిచ్చెదఁ దగఁ బెండిలిసేసికొనుము దయతోనని వే
డగ ముని నా కప్రియమును | మగువ యెవుడు సేయు నపు డు మానెదసుమ్మీ 381
క. ఆమాట కొడంబడినన్ నే మానిని బుచ్చికొందు నెమ్మి భుజంగ
స్వామీ యటు సేయుమనిన నా ముగద నొసంగి చనియె నహిపతి వేడ్కన్.382
ఉ. ఆ రమణీమణిం గలసి యాకులపాక వసించి యా జర
త్కారుడు భార్యఁ జూచి వనితా నను లేపకు నిద్రపోయేదన్
నా రుచిరాంగి యట్లయని నాథుని లేపకయుండె నంతలో
సూరుడు పశ్చిమాంబుధిన జొచ్చిన జూచి వెలంది యాత్మలోన్.383
ఉ. లేపకయున్న సంధ్య చెడు లేపిన నాకు నపాయమౌ గదా
యేపనిఁ జేయవచ్చునని యెంతయుఁ గుందుచు నెట్టకేలకున్
లేపిన మేలు ధర్మ మొక లేశము నాశముగాదు నాకునున్
లేపకయున్నఁ గీ డదియు లెక్కగొనం బనిలేదు చూడఁగన్.384
ఆ.వె. సంజయయ్యె వేగ సామి లే లెమ్మని పిలువ నతఁడు లేచి చెలియ యేను
బోవువాడ నీవు పుట్టంటి కేగుమ | టంచుఁ బలుక భీతి నార్తయగుచు.385
ఆ.వె. ప్రాణనాథ నీకు భ్రాత నన్నిచ్చిన యర్థ మెట్లు పొనగు సనిన మౌని
యస్తియనుచుఁ బలికి యరిగె గానలకును | నాతి సొచ్చెనంత భ్రాతయిల్లు.386
సీ. వచ్చిన చెలియలి వగపు దాఁ గనుగొని వాసుకి యడిగిన పనిత సెప్పె
జరిగినపనియును వరుఁ డరణ్యములకు బోవుచో మాయన్న పూని నన్ను
నీకిచ్చుకోరిక చేకూరు విధమెట్టు లనిన నస్తి యటంచు నతఁడు సనిన
విధమును నది దాను విని సంతసించి వాసుకి యుండె నింతలో సకియ గనియె
తే.గీ. మగశిశువు వాని నామంబు జగతియందుఁ బరగె నస్తీకుఁడంచు నా బాలకుండె
యజ్ఞమందును నీకడ కరుగుదెంచి మాతృపక్షంపు భౌజగజాతిఁ బ్రోచె. 387
వ. రాజేంద్రా! నీవలన సన్మానింపంబడిన యస్తీకుండు చేసిన పని కీర్తనీయంబయగు.
నీవును భారతంబు సర్వంబును వింటివి. నీకు మేలగుఁగావుత. నీవు చేసిన పుణ్యం
బునంబట్టి నీజనకుండు సుగతిం జెందె నీకుఁ గొరంత యేమున్నది. మహాదేవి
కాయతనం బమర్చి భక్తితో సేవింపుము. నీకు సకలంబును సిద్ధించునని చెప్పి
మరియు.388