పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

40

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

ఇచ్చోట మీఱంద ఱేమేమొ చేసి సం
        గీతము ల్ఫాడెడురీతు లేమి
యౌదుంబరశాఖ లమరంగఁ జేఁబట్టి
        వేఱ్వేర విప్రులఁ బిల్చు టేమి
యీయగ్నికుండ మే మీదారుపాత్రలే
        మీపశుహింస యే మిన్ని మీరు
మాకుఁ జెప్పుఁ డటన్న నాకర్మనిష్ఠు లి
        ట్లనిరి వపాయాగ మాచరింప


తే.

సమయ మిదిగాన వేదోక్తశాస్త్రవిహిత
మగువపాయాగ మొనరించి యవల మీరు
మమ్ము నడిగినదెల్ల సమ్మదము లీలఁ
జెప్పెదము వీను లాలింప నిప్పు డుండు.

145


తే.

అనుచు వచియించి యాగాఢ్యులందు హరిని
నాత్మ నెంచుచు నావపాయాగ మెలమిఁ
జేయుసమయాన శంఖచక్రాయుధములు
దాల్చి యందఱు చూడంగ దనుజహరుఁడు.

146


వ.

సముల్లాసంబుగ నవ్వపనుగ్రహించి తనచిహ్నము లెఱింగించి.

147


చ.

హరి పరమాత్ముఁ డచ్యుతుఁ డనంతుఁడు నిర్జరులెల్లఁ జూడఁగాఁ
గరముల నంది యావపను గ్రక్కున మెక్కఁగ సంయమీశ్వరుల్
వరుసఁగ నందుఁ జిత్తరువు వ్రాసినబొమ్మలరీతి భక్తిచే
బరవశులై రమేశుఁ డగుపద్మదళాక్షుని జూచుచుండఁగన్.

148


వ.

నారాయణుండు శ్రీవత్సలాంఛనాంచిత విశాలవక్షుండును
సదమలరత్నాభరణభూషితుండును కౌశేయపరిధానుం