పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/467

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

460

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


గాంచి ధరిత్రిపై నెంచవచ్చిన నిన్నుఁ
        బోనిత్తు నందాక పోవఁగూడ


తే.

దంచు సూర్యుండు వల్కఁగ నాశుకుండు
సమ్మతించుచు నిజతనుచ్ఛాయ నొక్క
పుణ్యపుర్షునిగాఁ జేసి బుద్ధి నిచ్చె
నప్పు డా పురుషుండు మహాత్ముఁ డనుచు.

164


చ.

శుకునకుఁ బద్మమిత్రునకు సుస్థిరుఁడై ప్రణమిల్లి భక్తితో
ముకుళితహస్తుఁడై నిలిచి ముందరనుండఁగఁ జూచి సూర్యుఁ డా
శుకమునియోగసిద్ధి కతిచోద్యము నొందుచు సంతసించి తా
నకుటిలచిత్తుఁడై జనితుఁ డైనకుమారుని చూచి యిట్లనెన్.

165


క.

మాయగ శుకమునిదేహ
చ్ఛాయను బుర్షుండ వగుచు జనియించిన నీ
వీయవనీస్థలి నరుదుగ
ఛాయాశుకుఁ డనెడుపేరఁ జరియించు మయా.

166


క.

అని సూర్యుఁ డానతిచ్చిన
నిని ఛాయాశుకుఁడు చాలవినయము మీఱన్
వినుతించి యవల నాశుకుఁ
గనుఁగొని యిట్లనియెఁ జాలగౌరవ మొప్పన్.

167


క.

జనకా నన్ను సృజించిన
పనియే మిపు డానతిచ్చి పంపుఁ డటంచున్
వినయంబున మ్రొక్కినఁ గనుఁ
గొని ఛాయాశుకున కాశుకుం డి ట్లనియెన్.

168