యౌవనకౌమారవార్ధకదశల ననుభవించి కాలపరిపాకంబున
మృతినొంది క్రమ్మఱం బుట్టినవారలు లోకాంతరంబులం
దనుభవించిన కష్టసుఖంబుల మఱలం జెప్ప మఱచివోదు
రటు గావున నీమువ్వురు కాలపరిపాకంబు గాకయ యన్నంబు
లేకయ నశించిన స్థూలదేహంబులం దుండక సూక్ష్మదేహం
బుల నవలంబించికొని లోకాంతరంబులం జరించి హరికటా
క్షంబువలన నప్పుణ్యతీర్థంబునం బ్రవేశించి పరిపూర్తినొందిన
పూర్వస్థూలదేహంబులంద మఱలం జేరినందున వారి
కాలోకాంతరవ్యాపారంబును హృదయంబులం దుండి నిద్ర
జెంది కలలం గని మేల్కాంచి పరుల కాకలలు చెప్పిన
చందంబున వారాకూర్మునకుం దమవిహారంబులు చెప్పి రిది
యంతయు విష్ణుమాయ యని యెఱుంగవలయు. నీయితి
హాసంబు విన్నవారి పాపంబు నశించి ధన్యు లగుదురని
చెప్పిన విని శౌనకాదులు సూక్ష్మజ్ఞానదృష్టిచేత జీవతత్వాను
భవప్రకారంబు తెలిసి సూతుం జూచి వెండియు నిట్లనిరి.