పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/396

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

389


బమలమణిరచితభవనమ
క్రమముగ భావింపు విశ్వకర్మ కుశలతన్.

285


సీ.

దేవాలయంబుగఁ దీర్పింపు మెట్లన్నఁ
        గుదురుగ నొకరెండుగోపురములు
ద్వారసప్తకమును దగు వాస్తుశాస్త్రప్ర
        కారంబుగాను వేంకటగిరేంద్ర
మందుఁ గట్టించి న న్నందుంచి నీవు ప్ర
        కాశుని జేయు నీకలియుగమున
మును పీనగంబుమీఁదను నీవు ద్రవ్విన
        బావి గట్టడమును బాగుమీరఁ


తే.

జేయుమన నద్భుతం బంద శ్రీనివాస
బావి నే నెప్పు డాస్వర్ణపర్వతమునఁ
ద్రవ్వలేదని నృపుఁ డన నవ్వి నృపుని
గాంచి యిట్లని పల్కె శ్రీకాంతుఁ డపుడు.

286


క.

మనుజేశ్వర జన్మాంతర
మునఁ జేసిన యట్టిధర్మములు మఱచితి నే
యనుమానించెద నది నే
వినుపించెద నిచట నీవు వేడుకమీఱన్.

287


క.

విను వైఖానసవంశం
బున నుద్భవమైన విప్రముఖ్యుఁడు విమలుం
డను శాంతుఁడు సద్గుణగణుఁ
డనఘాత్ముఁడు గోపినాథుఁ డనుఘనుఁ డవనిన్.

288


తే.

కృష్ణలీలల విని చొక్కి గెంట కతని
కలియుగాదిని పూజింపఁదలఁచి చోళ