పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

26

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యాకుమారస్వామియందుండ కతిదూర
        మరిగె భయంపడి యంత గుహుఁడు


తే.

వేంకటాద్రికి వచ్చి తా వేడ్క స్వామి
పుష్కరిణియందుఁ గ్రుంకి తెప్పున వరాహ
దేవు నీక్షించి భక్తిఁ బ్రార్థించి మ్రొక్కి
యపుడు కృతకృత్యుఁ డయ్యె షడాననుండు.

90


ఉ.

కావున వేంకటాచల మఘంబుల కెల్ల భయంకరంబునై
పావనమై సువర్ణమణిభాస్వరమై ధరణీసురాలికిన్
జీవనమై తపోజనవశీకరమై యజరుద్రశక్రసం
సేవితమై సుభక్తులకు శ్రీకరమై నుతిపాత్రమై దగున్.

91


క.

హరికల్యాణగుణమ్ముల
వరవేంకటగిరిని వెలయు వారక సత్యా
కరమై యవి వచియించిన
పరమార్థం బొకటె చూడఁ బండితులారా.

92


క.

ఘనమై ప్రాకృతజనముల
కనులకుఁ బాషాణములుగఁ గన్పట్టును స
జ్జనములకుం గనకాచల
మునుబోలె వెలుగు నిత్యమును మునులారా.

93


వ.

ఆ వేంకటాచలంబుననుండి వరాహస్వామి జనులకు దృశ్యా
దృశ్యుం డగుచు వర్తించు నప్పర్వతంబు భవతారకం బగు
చుండు ననిన శౌనకుండు సూతుం జూచి యిట్లనియె.

94


ఆ.

ఆవరాహదేవుఁ డాపర్వతాగ్రాన
నుండి యేమి సేయుచుండె నెవరి