పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/318

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

311


కొండమీద నుండెవాఁడె కొడుకా వాఁ డెవం డంటావా
బొల్లి నామంబులు పెట్టుకొని బొల్లిగద్ద నెక్కి కొల్లకాఁడై
యెల్లదిక్కుల దిరుగు నల్లనయ్యె తల్లి, వాఁడు నిబద్దిగాను
నారాయణుండె కాని నరుండు కాఁడే యమ్మా వాఁడు నీబిడ్డను
బెండ్లాడవలె నని యుండాఁడె వాని నీబిడ పెండ్లాడనెంచి
యుండాదె, కాఁబట్టి నీపుత్త్రికను ఆసామి కిచ్చి పెండ్లి చేసి
కన్నులార సూడుము తల్లి సుకంగా నుంటాది లేకుంటే
కష్టాలు రాఁబోతుండాదె యమ్మ' యని చెప్పిన విని ధరణీ
దేవి యెఱుకతం జూచి సంతసించి యిట్లనియె.

31


క.

ఓయెఱుకత నీమాటలు
మాయఁగఁ దోచినవి మనుజ మానినులను నా
రాయణుఁడు పెండ్లియాడిన
దీయవనిం గాన మెందు నిది నిజమేనా.

32


సీ.

అని వింత పడి నవ్వి యడుగఁగ నప్పు డా
        యెఱుకలసాని తా నిట్టు లనియె
నాస్వామి మదకరి నదలించి తఱుముచు
        వచ్చి నీసుతయున్నవనము సేరి
తనకులగోత్రము ల్తనకోర్కె నీముద్దు
        చిన్నారిబిడ్డకుఁ జెప్పినాఁడు
నీపుత్రి యది విని నిష్ఠురోక్తులు వల్కి
        యతఁ డెక్కి వచ్చిన హయముమీఁద


తే.

ఱాల రువ్వింప నేల గుఱ్ఱంబు వడియె
నతఁడు మన్నించి యావేంకటాద్రిఁ జేరె