పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/248

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

241


వ.

కొండొకతడవు చింతించి యా ధేనువందు లక్ష్యం బుంచి
యుండి, మఱికొన్నిదినంబులు గడచిన యొకనాఁడు పాలు
పిండగడంగినం బాలు లేకుండుటం జూచి గోపాలుని రావించి
యిట్లనియె.

157


సీ.

గోపాల యిపు డింతగొప్పావుపొదుగులోఁ
        బాలు లేకుండెడి లీల యేమి
నీ వరణ్యములోనఁ ద్రావినా వన విని
        గోపఁ డిట్లనియె నీగోవుపాలు
నేఁ ద్రావలేదమ్మ యెంచ దూడయ ద్రావి
        యుండును ననఁగఁ జాలుండు నదియు
మాయింట నున్నది పోయి పాలానునె
        దబ్బరలాడెదు దెబ్బలొదవు


తే.

ననఁగ నవ్వాఁడు భయపడి యమ్మ నేను
గనుట లే దెట్టిదుష్కార్య మనుచు నావు
దనకుఁ దాఁ బొదువునుబడి త్రావెనేమొ
యనఁగ వానిని దన్నించి యవల నంపె.

158


తే.

అపుడు వాఁ డేడ్చుచును జని యాలమంద
వెంటఁ దాఁ బోక యాగోవు వెంటనంటి
బోవఁగా నది ఫణిరాజభూధరంబు
మీఁది కెగనెక్కిపోయి వల్మీకమందు.

159


తే.

పొదుగు దిగజారవిడచి పా ల్పొలుపుగాను
బుట్ట నిండింపఁగాఁ జూచి దిట్టఁడైన
గోపఁ డప్పుడు తనచేతిగోడ్డ లెత్తి
గోవునడినెత్తిపై మించి గొట్టఁబోవ.

160