పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/22

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

15


క.

ధారుణి నీటను మునిఁగిన
కారణముస వాని నెత్తుకార్యంబున కీ
ఘోరాకారము దాల్చితి
నారూపము చూచి లక్ష్మి నగదె ఖగేంద్రా.

50


క.

నారూపం బీభూమికి
గౌరవముగఁ దోఁచి నన్ను గామించెను నే
నీరమణిని మోహించితి
నారామామణికి నొప్పునని విహగేంద్రా.

51


క.

ఈకఠినశరీరము మఱి
యీకరణిం బెఱుఁగుసటలు నీవికృతాక్షుల్
ప్రాకటదంష్ట్రాయుగ మీ
భీకరతను జూచి లక్ష్మి బెగడు ఖగేంద్రా.

52


క.

ఆవైకుంఠపురంబున
కేవిధమున వత్తు లక్ష్మి యెకసక్కెముగా
నీవెవ్వఁ డంచు నడిగిన
శ్రీవిష్ణుం డనఁగ నాకు సిగ్గగు గరుఁడా.

53


క.

కావున నచటికి నేలా
నేవిధమున నైన ధాత్రి నెడఁబాయక యిం
దే వసియించెద నన విని
యావిహగేంద్రుండు మ్రొక్కి హరి కిట్లనియెన్.

54


శా.

దేవా ధారుణి నుద్ధరించుటకుఁ బోత్రిత్వంబుచే మించి ర
క్షోవీరుం బరిమార్చి యబ్బురముగా క్షోణితలం బెత్తుటం
బ్రావీణ్యం బొగి నాదిదేవత మహాభక్తిం బ్రశంసించునం
దే వేంచేయుడు వేడ్కమీఱ హరి యోదేవోత్తమా
మ్రొక్కెదన్.

55