పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


పరతయు వైరాగ్యభావంబుకరణ ని
        గ్రహమును నియమంబు సహజసుఖము
నొసఁగు నాసనమందు నుండుట నిస్పృహ
        త్వంబు నొందుటయు నాత్మను మనంబు


తే.

నదిమి కుదిరించి నిల్పుట యాసనంబు
ప్రకటరేచకపూరకుంభకసమేత
మైసశ్వాసలలోనఁ బ్రయత్నముగను
గుదురఁ జేసిన యది రుద్ధగుంభక మగు.

124


వ.

ప్రాణుని సుస్థిరంబుగ నిల్పి ప్రపంచం బనిత్యంబని తలంచు
టయు ప్రాణాయామం బగు. నంతర్ముఖం బైన నిర్మలచిత్తం
బునఃఁ జైతస్యజాలంబుల నడచుటయు బహుప్రకారంబులై
జనియించు మనోవికారంబుల నేర్పరించి ద్వికారగ్రాసనంబు
చేసి మనంబును నిర్వ్యాపారంబుగ నిల్పుటయు, ప్రత్యా
హారం బగుస్వస్వరూపానుసంధానభావంబుచే, ద్వితీయ
తారహతాత్మానుభవంబున సర్వప్రపంచంబు నాత్మగ నెఱింగి
సకలభూతదయాసమత్వంబున, నిత్యతృప్తిం జెందియుండుట
ధ్యానం బగు. నంతర్బాహ్యప్రకారం బేకంబుగ స్వతేజో
మయంబుగఁ బరత్వంబు నుద్దేశించి తదీయధారణంబుం
జేయుచుఁ జిత్తంబును జునిఁగిపోనీక నిల్పుటయ ధారణం
బగు. తద్ధారణాభ్యాసంబునఁ జిత్తం బేకాగ్రం బగునప్పుడు
జీవాత్మ పరమాత్మయందు జలశర్కరన్యాయంబుగఁ గలసి '
యఖండబోధ నొందుటయ సమాధి యగు. నిట్టి సూక్ష్మాష్టాం
గంబులం బ్రకాశించు నారాజయోగంబునకు లక్షణంబు
సందేశంబుగఁ జెప్పెద. నది హంసాక్షరసిద్ధాసనకేవలకుంభక