పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/146

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

139


వ.

కృతత్రేతాద్వాపరంబులయందుఁ బెక్కువేలయేండ్లు తపం
బులు చేసిన హరి ప్రసన్నుం డగుట దుర్లభంబు. కలియుగం
బున ముహూర్తమాత్రంబు నిశ్చలుండై ధ్యానించినం
బ్రసన్నుం డగుచుండు. కాబట్టి కలియుగంబున శ్రీవేంక
టేశుని సేవించు టుత్తమం బని ద్వీపాంతరముల నుండు
వారును, సకలదేశవాసులుసు, వేంకటేశుని తుల్యుం డగు
దేవుండు లేడనియుఁ బుష్కరణినిభం బగుతీర్థంబును లే
దనియు నిది సత్యం బనియు మఱియుఁ గృతయుగాది
మూఁడుయుగంబులయందు. వేంకటాద్రి కనకమయంబుగ
నుండి కలియుగంబున శిలామయంబుగ జనులకు గన్పట్టు
చుండు. తద్గిరియందు వసించియున్న శ్రీనివాసస్వామి లీలా
వినోదవిహారంబు లనంతంబులై యుండుం గావున మీకు
సంక్షేపంబుగ నుడివితి నట్టి వేంకటాద్రియందు నిల్చి
యాచార్యసమాశ్రయణంబు గల్గి విష్ణుభక్తులగు వైష్ణవులం
జూచి వైమానికులు సంతసించుచుండుదు రన్యమతానలంబ
జను లైనను వేంకటేశునియందు భక్తిసల్పుచు నుండుదు
రందు వారును గృతార్థు లగుదురు. కలియుగమునందు జను
లతిశయవిత్తార్జనపరులై యనేకదుర్గుణంబుల నాశ్రయింతురు
గాని హరిని సుస్థిరచిత్తులై ధ్యానింపజాలరు. ధ్యానించి
రేని యయ్యీశ్వరుండు ముక్తిధనం బిచ్చువాఁడు. సకల
పావనస్థానంబులకు మించినస్థానంబు వేంకటాద్రి యనిన
సూతుంజూచి శౌనకాదు లత్యద్భుతం బంది యిట్లనిరి.

65