పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

83

క. నినుఁ బ్రోచి విలాసముగాఁ, గనుపించినలీల నిజముగా నిల్చునె నీ
      వనజాకరతీరము నా, యునికికి నిజపుట్ట యిట్టి యోజం గంటిన్.
క. సామాన్యమె యీతీర్థము, భూమిజనం బిచటఁ జేయు పుణ్యపదములున్
      నోములు పితృకర్మంబులు, కామతదానంబుకోటిగా ఫల మందున్.
క. కావున నీతీర్థము దఱి, రావిఁ బ్రవేశించినాఁడ రమ్మని దీలో
      కోవెలలోఁ బవళించి జ, నావళి రక్షింప పూటనై యున్నాడన్.
వ. అనియురకున్న రంగరమణా సహియింపుము తప్పు చేసితిన్
      మనమున నింత హెచ్చరిక మానిన మత్తుఁడ నగుచుఁ జేతులున్
      దనదు కపోలభాగములు తానె మెయింపుచు లేచి రంగధా
      మునిఁ గని మ్రొక్కి యిట్లు దినముల్ క్రమియించుచునుండె గావునన్.
క. ఈకథ వినియెడివారికి, నేకార్యము లాల్మదలఁప వడేరి యతి
      శ్రీకరులై శాత్రవకుల, భీకరులై యుందు నెపుడు పృథివీస్థలిపై.
గీ. మఱలి యొకతీర్థరాజంబు మహిమ వినుము, దివ్యమైయొప్పు కేసరితీర్థమహిమ
      నచట కాశ్యపమౌనిశిఖావతంసు, దురుతపోనిష్ఠ వసియించియున్న యతఁడు.
సీ. శ్రీకరం బైన కాశీపట్టణం బేలు జననుతుండు సుకీర్తి యనెడు రాజు
      ధార్మికుండై సర్వధారుణీచక్రంబు పాలింప కర్మానుభవముచేత
      తనకును బరివారమునకు సామజతురగములకు రుజలు యగ్గలము గాఁగ
      పీడింప నొగిలి యీబెడద మీదోషంబు తీర్థసేవలఁ గాక తీరదనుచు
      దలఁచి హరికీర్తినామ మేధానిధాను, కాశ్యపును గాంచి ప్రణమిల్లి కరయుగములు
      మొగిచి నిలిచిఁన గనువిచ్చి మ్రోలనున్న, రాజు నీక్షించి యమ్మౌనిరాజు బలికె.
ఉ. ఎచ్చటనుండి వచ్చితివి యెయ్యది పే రిపు డేమి గోరినా
      వెచ్చటి కేఁగఁగావలయు నేర్పడఁబల్కుము నిన్నుఁ జూచి నే
      మెచ్చితి నామదిం గరుణ మిక్కుటమయ్యె నభీష్ట మెద్ది యే
      నిచ్చితి నిందునందుఁగల దేటికి నీకు మహావికారముల్.
సీ. అనినఁ గృతార్థుఁడనైతి నోమునినాథ యేను కాశీపురం బేలువాఁడ
      లోకాననుఁడు సుబలుండు మజ్జనకుండు కృతపుణ్య నన్ను సుకీర్తి యండ్రు
      బలవంతర వ్యాధిబాధలచేత నే సపరివారులుగా జాల నొగిలి
      యాఢ్యులైనట్టి మావైద్యులు తమచేత దీరదీపని యని దిగులుపడిన
      మఘములు సుశాంతివిధులు హోమములు సకల, దానములును జపంబులు దైవతములు
      ప్రార్థనము మంత్రరక్షానిబంధనములు, చేతనైనట్టుఁ జేసితి ఖ్యాతిగాను.