పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/116

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

111

క. ధరణీజన దురితంబుల, ధరణీశుఁడు మునుఁగ నతని తనయులు దినమున్
      వరుస నొకఁడొకఁడుగా యమ, పురికిన్ సకుటుంబముగను బోయిరి వరుసన్.
మ. కచబంధంబులు వీడ గుబ్బలుపయిన్ గన్నీరు రాలంగ హా
      రచయంబుల్ చెదరన్ గలస్వనగతుల్ రాయంగ నెమ్మేను లెం
      తె చెమర్పన్ వదనంబు లెండ తనయార్తింబృంగి హాహారవ
      ప్రచురాలాపములం మహిం బొరలి రార్హల్ విష్ణు కాంతామణుల్.
చ. కొడుకులు బోవ వెంబడినె కోడలుకొమ్మలు గూలి రందుకై
      పడతులు గేహళీభవనపంక్తుల రోదన మాచరింపఁగా
      యడలుచు భీతినొంది తనయాపద కడ్డమువచ్చువారి నే
      యెడఁ గనలేక తా ధరణియేలిన మార్గము బుద్ధి నెన్నుచున్.
క. తనయట్టివాని కెక్కడి, తనవ్రాతంబు జనులు తల్లడగుడుపన్
      బెనుపాపంబున ధారుణి, బెనుపంగా లేక యార్తిఁ బెనచితి నకటా.
క. అనుచుఁ దరిలేని చింతా, వననిధిలో మునిఁగి మిగుల వందురుచుండన్
      జననాథు సుకృతవాసన, యనుభవమున కెదుకు కారుణాతిశయమునన్.
గీ. మును భరద్వాజమౌని భూములు జరించి, వచ్చె వాల్మీకియెడకును వాకొనంగ
      విన్నవారిఁక దా యెట్టివేళ నతఁడు, జయరథుని పట్టణోపాంతసరణిఁ జనఁగ.
క. ఆతఱి శిష్యుఁడు తారకుఁ, డీతనికిఁ బురోహితుఁడు సహిష్ణువరేణ్యుం
      డాతరి తనగురుచరణా, బ్జాతంబుల వ్రాలి పూజసలిపెన్ భక్తిన్.
క. పూజించి యొయ్యన భర, ద్వాజులతో తమనృపాలు వర్తనము నతం
      డీజాడ నున్నతెరఁగున్, వ్యాజము గల్పించి మనుపవలయుట దెలిపెన్.
శా. తా నౌ గాకని యమ్మహీశ్వరుఁడు చెంతన్ శిష్యుఁడున్ రాగ ను
      ద్యానశ్రేణులు జూచుచున్ జని భరద్వాజుండు వాల్మీకికిన్
      మౌనిశ్రేష్ఠునకున్ జగద్గురునకున్ సాగిల్లి యీభూవరున్
      దీనుంబ్రోవు కృపాసముద్ర యని యెంతేఁ బ్రార్థనల్ చేసినన్.
క. కరుణించి యతఁడు మును భూ, వరుపురమున నుండి వెడలి వచ్చినవారిన్
      ధరణీశుఁ డలర రండని, పరువడి సభఁగూర్చి వినయభాషణుఁ డగుచున్.
గీ. రాజునకు నెందు నేరంబు రాదు గాని, కెలని వారలగుణదోషములను జేసి
      పుణ్యపాపంబు లూరక ప్రోవువేసు, కుందు రింతియకా కాత్మమందు లగుచు.
గీ. భూమి నర్థంబు ధర్మంబు గామ మోక్ష, ములును రాజులచేఁ గాదె గలుగు టెల్ల
      వానిపై మీరలలుగఁ నెవ్వారు దిక్కు, నేడు మాకొఱకు నితని మన్నింపవలయు.