పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

109

క. జీవిత మియ్యక నేరము, లే వెదకుచుఁ దగినపనులు లెక్కింపని ధా
      త్రీవరు విరక్తి యెఱుఁగన్, సేవకులకుఁ బట్టపగలుఁ జీఁకటిగాదే.
క. వసుమతి వసుమతిగానీ, యసమానాధ్వరములందు నవనిసురకున్
      బసధనము లిచ్చిమను నీ, యశమే వినికాదె వచ్చునది నీయెడకున్.
క. అడుగంగవలసి సేమం, బడిగితిగా కిందు సములు నధికులు నీకున్
      బుడమి నృపాలురకొక వ్రే, ల్మడచి వచింపుటకుఁ గలదె మము విను మనఘా.
మాలిని. సంతతపాదకుంజరసమేతము సంతము శృంగతిరోహిత భా
      స్వంతము పుష్పగుళుచ్ఛకసౌరభనాసిత బిల్లివధూదన సీ
      మంతము దంతిమదోదక పూగసమాగమ చంద్రకితోసరివే
      శంతము నౌ హిమవంతము చెంత రసాదర మొప్పు మదాశ్రమముల్.
మ. కనుఁగొంటి నిను నిష్ట మెద్దియన మార్కండేయు నీక్షించి యి
      ట్లనియెన్ హేమకచక్రవర్తి భవదీయం బౌ కటాక్షంబుచే
      నెననొక్కింత గొఱంతలేక ప్రజలున్ విశ్వంభరాచక్ర మే
      నును సౌఖ్యోన్నతి నున్నవార మొకయందున్ లే వసాధ్యాంశముల్.
క. మీకుశలంబులు మీరలు, వాకొనఁగా వింటి మీదు వాత్సల్యమునం
      జేకూడెను బనులన్నియు, లోకోత్తమ యున్నవెలుతులున్ సమకూరున్.
గీ. వెలితి నెఱిఁగింతుఁ బరలోకవిభవమెల్లఁ, బుత్రులయధీనమగుఁగాన పుత్రహీనుఁ
      డెట్టిదరిఁజేరు నని యెంచి యేను మిమ్ము, శరణుఁజొచ్చితి నాలింపు కరుణ ననిన.
క. బలభేదితో బృహస్పతి, పలికినచందమున రాజ పరమేశ్వరితో
      బలికె మృకండుతనూజుఁడు, జలచరగంభీరనినద సంరంభమునన్.
గీ. ఎంతపనియిది భూపాల యేలనింత, చింతిలఁగ రంగశాయి రక్షింపఁగలఁడు
      వెన్న గలుగంగ నెయ్యేలవేడ నొకని, రమ్ము పోదము నేఁడు శ్రీరంగమునకు.
ఉ. పాయు నఘంబులన్నియును భద్రము లొక్కట సంభవించు ర
      మ్మీ యవనీశ యంచుఁ దన యోలమునన్ హితమంత్రియుక్తుఁడై
      యాయవనీశ్వరుండు వినయప్రియసూక్తుల వెంటరాఁగ రం
      గాయతనంబు జేరి శిఖరావళి దర్శన మాచరింపుచున్.
సీ. అనఘ శ్రీరంగ మగుసరోజికి దాన యష్టదళపద్మ మగుచుఁ జంద్ర
      పుష్కరిణి యెసంగుఁ బొలుచు రేకులరీతిఁ దీర్థముల్ కేసరితీర్థ మొప్పు
      పావనదిశ నుత్తరావని నమరు కదంబతీర్థము మూలఁ దనరు నామ్ర
      మనెడితీర్థంబు తూర్పున బిల్వతీర్థ మింపలర జంబూతీర్థ మనలదిశను