పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/88

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

59


గనకలతా పింగ ఘనకపర్దము తోడ
            గంధర కందర కాంతితోడ
నురగ హారావళీ స్ఫురిత పక్షముతోడ
           బాహాచతుష్క విభ్రమముతోడ
కటిరూఢ గజచర్మపట విలాసముతోడ
           వీరాసనాభ్యాస విధముతోడ

దనరు శ్రీ దక్షిణామూర్తి దనదు చిత్త
పద్మమందున నిల్పి తాఁ బరమభక్తిఁ
దపముగావించు నారాజు తపము జెఱుపఁ
దలఁచె నింద్రుండు కపట కృత్యంబుతోడ.92


అంతఁదా నొక్క శ్యేనంబై పావకుండు కపోతరూపంబై రాజు మఱుంగున కరిగిన దాని భక్షించు తెఱంగునఁ దన్నికటంబున కేఁగిన నన్నరేంద్రుండు శరణాగత రక్షకుండగుట నక్కపోత సమాన మాంసంబిచ్చి దాని బ్రదికించెదనని నిజ దేహస్థిత మాంసంబు నిశితాసిం జెండి తులారోపణంబు చేసిన నది కపటకపోతంబగుట స్వదేహస్థిత సర్వమాంసంబును దానితోడ సరిఁదూఁగకున్న తన శిరోదేశంబున బిలంబు గావించి శిరస్థితమాంసం బంతయుఁ దులయందిడు సమయంబున నమ్మహేశ్వరుండు,93


శివుఁడు శిబికిఁ బ్రత్యక్షమగుట


అతని ధైర్యంబునకు మెచ్చి హర్యజాది
సురలు గొలువంగ బార్వతీ సుదతిఁ గూడి
నందివాహనమెక్కి యానంద మొదవ
యవనిపతి కంత నెదుటఁ బ్రత్యక్షమయ్యె.94

ఇట్లు ప్రత్యక్ష మగుచు న య్యీశ్వరుండు
క్ష్మాపతినిఁ జూచి యో శిబిచక్రవర్తి :