పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/85

ఈ పుట ఆమోదించబడ్డది

56

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము



అని మహాదేవి పలికిన నభవుఁడనియె
ఘనతరంబైన యా నదీజననవిధము
తత్ప్రభావంబు సర్వంబు తథ్యముగను
తెలియ జెప్పెద విను హిమాచలతనూజ !77

ఓంకార నదీ వృత్తాంతము


మును శిబిచక్రవర్తి పరభూభుజులన్ బరిమార్చి వేడ్క మే
దిని గిరి వార్ధి కానన నదీ సహితంబుగనేలి, సర్వభూ
మినిఁ గల భోగ భాగ్యము లమేయగతిన్ భుజియించి మించి తా
వనమున కేఁగె నందు నవవర్గము గోరి తపంబు సేయఁగన్.78

చని యాతండు త్రికూటనామక మహాశైలాధిరాట్పశ్చిమా
శను దానేగియు యోజన త్రయిని శేషాద్రీంద్ర పుచ్ఛస్థలీ
ఘన భూభృన్నికటంబునందు నిలిచెం గాంక్షావిహీనస్థితిన్
మునివేషంబున వల్కలాంబర జటామూర్థప్రభాభాసియై.79

అందు నొక పర్ణశాలయం దధివసించి
మున్ను తన రాజ్యభోగంబు లెన్నికొనుచు
నింతకాలంబు విషయైకచింత చేత
పోయెఁగాలము తృష్ణ తాఁ బోవదయ్యే.80

అని తలంచుచుఁ దన మనంబున నిట్లని వితర్కించె,81

తలిరుంబ్రాయము మోహినీసదృశ సౌందర్యంబు విన్నాణమున్
గులుకుం గుబ్బలు నవ్వుమోము సుమనః కోదండభ్రూవల్లరుల్
గల కాంతామణులన్ రమించితి ననేకావృత్తినై నం గనం
గలనే తృప్తి యొకింతయేని యహహా : కామంబు దుర్లంఘ్యమౌ. 82