ద్వితీయాశ్వాసము
55
ఎఱుగని వారికి నెఱి ప్రపంచముగాఁగ
గనుపడి యెఱిగిన ఘనుల కెపుడు
బ్రహ్మమై యుండిన పరశివు కైవడి
య మ్మహాపర్వతం బరసి చూడ
నెఱుఁగని వారికి గిరిరాజముగఁ దోఁచి
యెఱిఁగిన విజ్ఞానివరుల కెపుడు
నజ హరి రుద్రేశ్వ రాఢ్య సదాశివ
పంచకాకృతిగ నేర్పడఁగఁ దోచు
తన్మమహత్వంబు చిత్రమౌ తత్త్వవేది
బృంద సంసేవ్యమును మహానందదాయి
యైన య గ్గిరి నివసించునట్టివారి
కిష్ట సిద్ధు లొసంగు కోటీశ్వరుండు.73
ఆ పరమాద్రిరాజ శిఖరాగ్ర దృషన్మయ సద్మమందు తా
రాపతి శేఖరుండు సుచిరంబుగ నుండుట త జ్జటాటవీ
దీపిత యౌ సురాపగ నదీమని వారిధిఁ జేరబోవు నెం
తే పరిపూర్ణమౌ నొక నదీతిలకంబు వసించు నచ్చటన్.74
అరయంగ ద్రికూట స్థలి
పరగఁగ నోంకార మెపుడు భాసిలుచుండున్
ధరణి త్రికూటాద్రి స్థలి
పరగఁగ నోంకార నదియు భాసిలుచుండున్.75
అన విని పార్వతి యిట్లను
మునిసేవిత: యచటి నదికి మోక్షప్రదమై
చను ప్రణవాభిద యిల నే
యనువున వర్తించెఁ దెలియ నానతి యీవే?76