పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/104

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము.

73


గరము రాజ్యార్థమై కలహంబు పొడమి
చతురంగబలములు సమయంగ వారు
హతబుద్ధులై చెందినట్టి రాజ్యంబు 1750
సరసశంఖణుమంత్రిజనులచే నిచ్చి
ధరణీశు రావించి తసరుపట్టంబు
కట్టుఁ డనుడు వారు కడువడి నెల్ల
పట్టుల వెదకుచుఁ బరతెంచి విభుని
గోదావరీతీరకుంజాంతరమున
నాదరంబునఁ గాంచి యట్టి వృత్తాంత
మంతయుఁ దెల్పి వాహనములమీఁద
నింతిని మహికాంతు నిడుకొని యరిగి
పురముఁ జేరంగ నా భూపతుల్ వచ్చి
సిరులు మించఁగ నభిషేకంబుఁ జేసి 1760
రంతట సాంకాస్యమను పురంబునను
సంతుష్టచిత్తుఁడై శంఖణాహ్వయుఁడు
నంభోజముఖియు మహాసౌఖ్య మరల
కాంభోజదేశంబు కరుణఁ బాలించి
క్రతువులు సలుపుచుఁ గడు ధర్మనిరతి
శ్రుతులఁ బోషింపుచు సిరు లొందుచుండె.
కావున స్వామిపుష్కరిణివైభవము
లీ వసుధ నుతింప నెవరికిఁ దరము
మునుపు వాల్మీకిసన్ముని యానతిచ్చు
వినుతేతిహాసంబు వివరించి తిపుడు 1770
ఈ కథవినువారి కిష్టసంపదలు
చేకురు భాగ్యంబు సిద్దించు నిజము