ద్వితీయాశ్వాసము
49
శా. వేదాధ్యాపకులైన రాచిలుకలన్ వేదాంతమీమాంసలన్
వాదం బిమ్ములఁ జేయు శారికల దత్త్వం బిందు[1]జూటుండుఁగా
నాదేశించు పురాణముల్ చదువు చక్రాంగంబులన్ సామముల్
నాదంబొందఁ బినాకిఁ బాడు నళులన్ వందారుఁడై చూచుచున్.49
చ. చనునెడ నంతలో గుడిభుజం బదరంగఁ దొణంగినన్ మనం
బునఁ గడుఁ జోద్యమందుచుఁ దపోవన మిచ్చట దీనికిన్ ఫలం
బొనర మనోజ్ఞమూర్తియగు యుగ్మలిఁ గౌఁగిలిఁ జేర్పఁగావలెన్
గొనకొని యీశ్వరుండ యెఱుఁగం గనరానిది మానుషంబునన్.50
మ. అని నాల్గేనుపదంబు లేఁగునెడఁ గర్ణానందసంధాయులై
వినగా వచ్చెఁ బ్రియంవదా నిగిడి రావే యంచు రారాఁగదే
యనసూయా యని వృక్షసేచనము సేయం జాలఁబ్రొ ద్దెక్కెఁగా
యని యాక్షేపము సేయు నొక్క తనుమధ్యామంజులాలాపముల్.51
క. ఆమాట లాలకించుచు
భూమీశుఁడు కొన్నిచరణములు చని యడరన్
గామునిదీపము లనఁజను
వామాతుల ముగురఁ జూచి వారలలోనన్.52
శా. చంచత్పల్లవకోమలాంగుళకర స్సంపూర్ణ చంద్రానన
న్యంచచ్చందనగంధి గంధగజయానం జక్రవాకస్తనిం
గించిన్మధ్య దటిల్లతానిలసితాంగిం బద్మపత్రాక్షి వీ
క్షించెన్ రాజు శకుంతల న్మధుకరశ్రేణీలసత్కుంతలన్.53
సీ. దర్పకురాజ్యంబు దలచూప నెత్తిన
బంగారుటనటికంబము లనంగ
రతిమన్మథులు విహారమునకై చేతుల
బట్టి యాడెడి నిమ్మపం డ్లనంగ
- ↑ జాటుండుఁగా