ద్వితీయాశ్వాసము
71
శా. ఆశార్దూలముఁ జూచి భీతహృదయుండై మేను కంపింపఁగా
నాశల్ చూచుచు బ్రాహ్మణుం డపుడు ప్రాయఃప్రాణరణార్థ మై
యోశార్దూలమృగేంద్రచర్మధర, యోయుగ్రాక్ష, యోయద్రిజా
ధీశా యీయపమృత్యువుం గడపరావే యంచు గీర్తింపఁగన్.154
వ. ఆవిప్రవరుని యార్తియు నిర్దయశార్డూలవిస్ఫూర్తియుం గనుంగొని
కారుణ్యమూర్తియగు నారాజు భీతచేతస్కుండైన వాని నుపచరించుచు
శీఘ్రగమనంబున వచ్చు వ్యాఘ్రంబు నడ్డగించునప్పు డది నగరివేఁటపులి
యగుటం దెలిసి మృగయు లెట్టు దీని నేమఱిరి, దీనివలన నీయాశ్రమ
వనతనుసత్త్వంబులకు నపాయంబు పుట్టిన మహాపరాధంబు వచ్చు ననుచు
నమ్మృగరాజుం బట్టుకొన బంధురగమనంబున నిజస్కంధావారంబునకుం
జనుచు దనమనంబున.155
క. తాపసశిష్యుని లలితా
లాపంబుల నాశకుంతలావృత్తాంతం
బేపారఁగ వినియును నా
త్మాపాలుఁడు సంతసిలక సంశయచింతన్.156
గీ. కన్య క్షత్రియవీర్య యౌఁగాక యేమి
కణ్వుఁ డొకనికి నీఁ గడకట్టెనేని
చెలువ నామీఁదఁ గూరిమి సేయదేని
రెంట దుష్యంతుకోర్కి పూరించు టెట్లు.157
చ. కొనగొని తావి మూర్కొనని క్రొవ్విరి, యెయ్యెడ వజ్రసూచి డా
యని రతనంబు, జిహ్వచవి యానని తేనియ, గోరు మోపి గి
ల్లని చిగురాకు, లాలితవిలాసనికేతన మాలతాంగి, దా
ననుభవకర్త యేఘనుఁడొ యావిధియత్న మెఱుంగనయ్యెడున్.158
ఉ. ఆడదుగాని మాట లొకయంచుల నించుక వీను లొగ్గి నా
యాడినమాటలెల్ల విను నర్మిలితోఁ దను నేను జూచినం