పుట:శృంగారనైషధము (1951).pdf/282

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

265


య్యతివపయోధరంబులకు నర్ధనిశాసమయంబున న్సమం
చితనఖకింశుకార్చనము సేసె మహీపతి భక్తి యేర్పడన్.

178


తే.

లావునను గూడి పాణిపల్లవయుగమున
నొ త్తిపట్టిన సరకు గా కుల్లసమున
హారకాంతిచ్ఛలంబున నల్లనవ్వు
తరుణిచన్నులు రాజుచిత్తము హరించె.

179


క.

తరుణికి ధాత్రీపతికిని
బరిచుంబనవేళ దంతపరిపీడన మి
క్షురసంపుఁబానకములో
మిరియపుఁగారంబువోలె మె చ్చొనరించెన్.

180


తే.

చూచియునుఁ జూచుఁ గ్రమ్మఱ సుదతిఁ దివుటఁ
గౌఁగిలించియు నప్పుడ కౌఁగిలించు
జుంబనము సేసియును రాజసూనుఁ డెలమిఁ
జుంబనము సేయుఁ భౌనరుక్త్యంబుగాఁగ.

181


తే.

కులుకుటెలుఁగుల నలరారు పులకములను
గంపములను సమగ్రసీత్కారములను
జుంబనక్రీడలందు రాసుతునిమోము
శీతకరుఁ డౌట చెప్పక చెప్పె నబల.

182


ఉ.

వంచన లేక యాననము వాంచినయప్పుడు ఫాల మోర గా
వించుడుఁ జెక్కుడద్దములు వ్రీడభరంబునఁ గీ లెఱింగి చుం
బించి మనంబు తాలిమి గభీరతరిత్తకు నెత్తఁ బూనినన్
మించి ముఖాబ్జచుంబనము మేకొనినవ్వు విభుండు నేర్పునన్.

183