పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/420

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 379


నంతరతి వొడమ నుడిగపు
టింతులతోఁ గొలువు దీరి యేతెంచుటయున్.

610


క.

వచ్చిన దివ్వటివెలుఁగున
నచ్చెలువలు నాథుఁ జూచి రాతఁడుఁ గనియెం
దచ్చపలాక్షులఁ గనుఁగొని
యిచ్చమహాశ్చర్యసమభివృతముగ నిలువన్.

611


క.

తరుణులు నలువురు నపుడొం
డొరులచరిత్రంబు లెఱిఁగి యొదవినభయము
న్నిరసించి యొకయుపాయము
దొరకొన విభుఁ జేరి ధైర్యధుర్యాత్మకలై.

612


వ.

కట్టెదుట నిలువంబడి కాళికాపదాంబుజంబులు భజియింప నింపునం జనుదెంచిన యక్షకమలాక్షుల మిన్నలువురము మదీయనాయకులు నేమును ననుదినంబు నిశాసమయంబున నిచ్చటికి వచ్చి పోవుదుము. మాకు నతీతానాగతవర్తమానంబులు తెలియుట కడుగం బనిలే దింత యేల నీయంతరంగంబున భవదీయభార్యాసౌందర్యవిశేషభాషణాదులు మాయందుఁ దోఁచుటం జేసి సందియంబు కందళించినది కావున నింతయుం దెలుపవలసె నచ్చెలువలు మాయంశంబున జనియించినవారలు కావున మాపోలికలు వారికిం గలిగియుండు నయ్యండజయానలకు శుభంబుఁ
గోరికదా యేతన్మహాశాంకరీపదపంకజారాధనకు ననురాత్రంబు నరుగుదెంతు మిందు రమ్మని యిందుధరసుందరీసమీపంబునకు దోడ్కొనిపోయి నిర్మాల్యప్రసాదంబుగా విభూతి యొసంగి నీయంగనల సద్ధర్మంబుగా నేలి మామనంబులు