పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/382

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 341

దుడుగక యొనర్చి పిమ్మట
యడలిన వటమునకు సుద్ది యగుదువు సుమ్మా. 433

ఆఱవ యుపకథ


చ. అది యెటులంటివేని వినుమా హురిశాహురినుండిపన్నగాం
గదుని నివాసమై యలరు కాశికిఁ బోయెడుత్రోవ నీడపు
ట్టదు గద నాఁగమించినయెడ న్నొకచో నొకలేఁతమఱ్ఱి య
భ్యుదయము నొందసాగెఁ దఱినొందినవానలచేత నంతటన్. 434

తే. అధ్వగులు కోడిగములకై యాకులెల్ల
ద్రెంచి శాఖావితానము ద్రుంచివైవ
మోడుపడియుండె నది నిల్వనీడపట్టు
గొమ్మయును లేమి తనయందుఁ గుదురుకొనఁగ. 435

తే. అంత నొక శైవుఁ డాత్రోవ నరుగువాఁడు
కెలని కొలనున నాహ్నికక్రియలు దీర్చి
చెంతఁబడియున్నఱాయి యాచెట్టుమొదటఁ
జేర్చి విఘ్నేశుఁ డనుచుఁ బూజించి చనిన. 436

క. అది మొదలుగఁ దెరువరులిం
పు దలిర్పఁగఁ దెచ్చి తెచ్చి పుడిసెఁడు నీళ్లుం
బదియైదు గఱికిపోచలు
గదియించి చనంగ నచట గణపతి నిలిచెన్. 437

సీ. పాల్పొంగి వఱదలై పాఱఁ జెంగటి యూళ్ల
కాఁపుగుబ్బెతలు పొంగళ్లువెట్ట
నీళ్లు వెల్లువగట్ట నికటాగ్రహారథ
రాసురు ల్నారికేరములు గొట్ట