పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/368

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 327

నన్నము వస్త్రం బిడుచున్
నన్నుం బోషించు మింక నలినదళాక్షీ. 368

వ. అను నప్పలుకుల కప్పడతి యతనిం దప్పక కనుంగొని యతండు నిజాగమనసమయమున నింటిలోన లేఁడనియు నింతలోన నిప్పాపి కంధత్వంబు ప్రాప్తించెనే యనియును మదీయభ్రమావిభ్రమం బింతియె కాక లోకంబులో నుపలంబులు పలుకంజాలునే యనియును జల్పపరాయణుండై యితం డద్దేవిమఱుఁగున గూర్చుండి పలికెం గావలయు నని సిద్ధాంతీకరించి వంచనాపరుం డగునితనిం బోషించిన మంచిదాన నగుదునే యని యెంచి కావించినసమంచితాన్నశాకానీకంబులు జారలోకంబున కల్పించిన నవ్విష్ణుశర్మయు నెఱుంగక నిత్తెఱంగున మాటలాడి నోటికూటికిఁ జేటు దెచ్చుకొంటిఁగదా యని డెందంబునం గుంది వినిందితరసనుండై కృశించెం గావున మౌనంబున నుండుమని ఖంజరీటంబు తెల్పిన సానుభవంబున మేను మఱచి యయ్యురగవరుం డేతత్కథావిశేషం బింతయొప్పునే యని యుచ్చైస్వనంబునం బలికిన నులికిపడి యవ్వతికిం జనిన మండూకమండలేశ్వరుం గనుంగొని యిప్పాట నోటికడి పోఁగొట్టుకొంటివే యని ఖంజరీటం బరిగెఁ గావున. 364

ఆ. పరుల నడుగరాని పరమరహస్యంబు
లడుగఁ దగునె విక్రమార్కభూప
నీవె తెలిసికొనుము నేఁడెల్ల లేకున్న
ఱేపు తెలియ నేర్పఱింతు నీకు. 365