206 శుకసప్తతి
త్పాకము రాకనిశీథిని
పోకఁడ గని యంత నంతిపురమున కరిగెన్. 401
క. చని దిన మను వననిధినీఁ
దినయదియై రాత్రి పేరి దీవిం గని య
వ్వనజాక్షి యూఱడిలి నృపు
నెనయం జనుదేఱఁ జిలుక యిట్లని పలికెన్. 402
శా. కాంతా సంతసమయ్యె నామది వధూకందర్పుఁడౌ నద్ధరా
కాంతుం జేరఁగ నుత్సహించియును మద్గాథాసుధాలోలుప
స్వాంతత్వంబునఁ జేరవచ్చెదు భవత్సౌలభ్యసాద్గుణ్య మే
నెంతంచు న్గొనియాడ నేర్తు మఱి నీవే నీకు జో డిమ్మహిన్. 403
క. [1]క్రమ్మఱ నొకకథఁ దెలిపెద
ధమ్మిల్లోత్ఫుల్లకుసుమధామంబులపై
దుమ్మెదలు చిమ్మిరేఁగం
గొమ్మా తలయూఁచి మెచ్చికొమ్మా పిదపన్. 404
పదునాలుగవకథ
చ. అని తెలుపందొడంగె విను మంబుధి మోహపురాణివాసమై
తనరెడు కృష్ణతీరమునఁ దామ్రపురం బనుకాఁపుటూరు భూ
వనరుహగంధి నెమ్మొగము వైఖరిమీఱు విశేషకాంతి వ
ర్తనము వహించి మించు విదితంబుగఁ జూపఱ కిం పొనర్చుచున్. 405
చ. కొలుచు సమగ్రభంగి నొనగూడ దివాణపువారిచేతికాఁ
కలుహుసివోవఁగాఁ గఱవుకాల మెఱుంగక పూసబొట్టులం
- ↑ ఇది హంసవింశతిలోగూడ గలదు.