110 శుకసప్తతి
దల్లికి వీను లెంతయుఁ జల్లనాయెఁగా
నాయగాధప్రయాణంబు విన్న
దాదియపఖ్యాతిఁ దలఁపలేదాయెఁగా
దాయగాఁబోలు నింతయు సహింప
నాళీజనశ్రేణి కాత్మ కింపాయెఁగాఁ
బాయఁగారాని యీబారినొంద
తే. నకట! నాయీడు రాచకన్నెకల కెల్లఁ
గడఁగి నన్నాడుకొన నోరు గల్గె నేమ
నందు నిఁక నెందుఁజొత్తు నాహావిధాత
వ్రాఁత యవిలంఘ్యమనియెంచు వడిఁ దపించు. 474
శా. అన్నీలవేణి యివ్వగ
నున్నంత సమీపభూమి నొక రాజు శుభా
భ్యున్నతుఁడు రశికశేఖరుఁ
డెన్నఁగ హిమథామనాముఁ డేపు దలిర్పన్. 475
తే. అతులితోత్సాహమున వేఁటలాడియాడి
కడఁగి యచ్చోటనే వీడువిడిసెఁ గానఁ
గర్ణయుగమునఁ దత్కన్యకాప్రలాప
కలకలధ్వను లాలించి జలదరించి. 476
మ. ఇదియేమో మనపాళెమెల్ల వగ న ట్టి ట్టై వెతం జెంద ని
న్నదిలోన న్విననయ్యె నాఁడు మొఱ కాంతారత్న మిం దెవ్వతో
మది నూహింపఁగరాని దుర్దశ వహింపంబోలు నేఁ డీవిప
త్పద మేమో వివరించుఁ డంచుఁ గరుణాపారీణచేతస్కుడై. 477
ఉ. భూరిజలప్రచారులగు బోయలఁ బంపిన వారలాపయః
పూరమున నెలంగు కలముం బలె నుండెడు మందసంబు న