వెలుగోటివారి వంశావళి
75
కుశలంబెకా గాయగోవాళ నీకును[1], నోపరనారీసహోదరుండ, పరిణామమే[2] నీకుఁ బద్మవంశపవిత్ర, పరమశ్రీవైష్ణవపారిజాత, యనుచు సంతోషచిత్తుఁడై యభినుతించి యిష్ట మెయ్యెది వేడుమీ యిత్తు ననిన ఫాలమునఁ గేలు కీలించి ప్రస్తుతించి రసికతను[3] బల్కె సింగయరాయవిభుఁడు.
సింగయరాయభూవిభుఁడు శ్రీహరిఁ జూచి నుతించి దేవ శ్రీ రంగములోనఁ బూని ధనరాసులు విప్రుల కిచ్చి యాగముల్ సంగతిగా నొనర్చినను సద్గతి గల్గుట దుర్లభంబ యీ సంగరభూమివంక మిము సందరిసింపను గల్లెఁ జాలదే.
ఇల బ్రహ్మచర్య మాదిగ[4] వలసిన యాశ్రమము లెల్ల వ్రతనిష్ఠలతో సలిపిన పుణ్యులు నినుఁగనఁ[5] గలుగుదురే నీదు[6] చరణకమలముఁ గంటిన్.
అనిన సరోజలోచనుఁడు నాదర మొప్పఁ[7] గటాక్షవీక్షలన్[8] గనుఁగొని రాయభూరమణ, కాంచితి నిన్ను[9] సదానురక్తి నీ వనయము నాదు సన్నిధిని నర్జునభీష్మవిభీషణాదిస జ్జన[జన]పాల[10] భాగవతసంఘములోపల నుండు మెప్పుడున్.