మగధవంశప్రభుండగు జరాసంధునకు సహదేవుండు, సహదేవునకు సోమాపి,
సోమాపికి శ్రుతశ్రవుండు, శ్రుతశ్రవున కయుతాయువు, నయుతాయువునకు
నిరమిత్రుండు, నిరమిత్రునకు సునేత్రుండు, సునేత్రునకు బృహత్కర్ముండు,
బృహత్కర్మునకు సేనజిత్తు, సేనజిత్తునకు శ్రుతంజయుండు, శ్రుతంజయునకు
విప్రుండు, విప్రునకు శుచి, శుచికి క్షేమ్యుండు, క్షేమ్యునకు సువ్రతుండు,
సువ్రతునకు ధర్ముండు, ధర్మునకు సుశ్రవుండు, సుశ్రవునకు దృఢసే
నుండు, దృఢసేనునకు సుబలుండు, సుబలునకు సునీతుండు, సునీతునకు సత్య
జిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకు రిపుంజయుండును బుట్టఁగలరు.
వీరలు బార్హద్రథులు; రాజులై వెయ్యేండ్లు భూపాలనంబు చేయఁగలరు.
ఆరిపుంజయుని యమాత్యుండు మునికుండనువాఁడు స్వామియైన రిపుంజ
యునిం జంపి ప్రద్యోతుండను తనపుత్రునిం బట్టంబు కట్టంగలండు. ఆ ప్రద్యో
తునకు బలాకుండను పుత్రుండు గలుగు. వానికి విశాఖయూపుండు, వానికి
జనకుండు, వానికి నందివర్ధనుండు, వానికి నందియుఁ గలుగుదురు. ఈ ప్రద్యోత
వంశ్యులు నూటముప్పదియాఱేండ్లు భూమి పాలింతురు. తదనంతరంబ శిశు
నాభుండు, వానికిఁ గాకవర్ణుండు, వానికి క్షేమధర్ముండు, వానికి క్షతౌజుండు,
వానికి విధిసారుండు, వానికి నజాతశత్రుండు, వానికి నర్భకుఁడు, వాని కుదయనుండు,
వానికి నందివర్ధనుండు, వానికి మహానంది పుట్టెదరు. వీరు శిశునాభవంశంబు
భూపాలకులు. మున్నూట యిరువదాఱేండ్లు భూమి పాలించెదరు. అంత.