పుట:విక్రమార్కచరిత్రము.pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

51


పొచ్చెము వాయుట కొఱకై
యిచ్చెద బ్రహ్మాస్త్రమైన నీతని కనుచున్.

35


బ్రహ్మ విక్రమార్కునకు బ్రహ్మాస్త్ర మొసంగుట

సీ.

సిద్ధాదు లగుకోష్ఠసీమలు పరికించి
        నామానుగుణము నిర్ణయము చేసి
యుచితదీక్షాకాల మూహించి యభిషిక్తుఁ
        జేసి జితస్థానసిద్ధి దెలిపి
కూర్మాసనాదులమర్మంబు లెఱిఁగించి
        యష్టాంగవివరణం బాచరించి
భూతశుద్ధితెఱంగు బోధించి మాతృకా
        విన్యాససరణి యుపన్యసించి


తే.

యావరణశక్తిబీజాధిదైవతములు
బలులు జపహోమతర్పణావళులు సెప్పి
సప్రయోగోపసంహరణప్రవీణుఁ
జేసి, బ్రహ్మాస్త్ర మిచ్చె నబ్జాననుండు.

36


వ.

ఇచ్చి మఱియు నిట్లనియె.

37


క.

మానుషశక్తి జయింపఁగ
రానిమహావీరు లైన రణశూరులపై
దీనిఁ బ్రయోగింపుము, బల
హీనులపై మఱచి యైన నేయకు మధిపా!

38


క.

అని బ్రహ్మ యానతిచ్చిన
జనపతి సాష్టాంగ మెరఁగి, సంభావితుఁడై
తనపురికి నరిగి జగతీ
జనరక్షణ చేయుచుండె సత్వరమతియై.

39


వ.

అంత, నాచంద్రపురంబునఁ జంద్రగుప్తాన్వయవార్థిచంద్రుం డైనరాజేంద్రుఁడు కీర్తిచంద్రికాసాంద్రుండై యుల్లసిల్లు టెఱింగి, త్రిజగదాశ్చర్య