పుట:విక్రమార్కచరిత్రము.pdf/45

ఈ పుట ఆమోదించబడ్డది

44

శ్రీశాస్త్రులవారి మాచనల ననుసరించి చాలవఱకు దోషములను బరిష్కరించి పునర్ముద్రించిరి. ఈ ప్రతి యందును దోషము లున్నను జాల తక్కువ.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షమున ఈ విక్రమార్కచరిత్రము శుద్ధప్రతిని సిద్ధము చేయుటకు నేను వావిళ్ళవారి 1926 సంవత్సరము ముద్రితప్రతిని అతికష్ట ముతో సంపాదించఁగలిగితిని. దీనిని శ్రీ శాస్త్రులవారి విమర్శనసహాయముతో యథాశక్తిఁ బరిష్కరించితిని. స్వయముగాఁ గొన్ని సవరణలు చేయవలసివచ్చినది. పై గ్రంథములే కాక, (1) శ్రీ వీరేశలింగము పంతులుగారి ఆంధ్రకవుల చరిత్రము (భా. 1); (2) శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారి విజయనగర సామ్రాజ్య మందలి ఆంధ్రవాజ్మయ చరిత్రము (భా.1 ); (3) శ్రీ చాగంటి శేషయ్యగారి ఆంధ్రకవితరంగిణి (సం. 4) యును ముఖ్యముగాఁ దోడ్పడినవి. ఏతత్కర్తలకు నా కృతజ్ఞతలు.

ఈ గంథమును బరిష్కరించుటలోఁ బూర్వముద్రణ మందలి ముద్రణదోషములు కనఁబడినంతవఱకు సవరింపఁ బడినవి. ఉన్న పాఠాంతరములలో సరసములును సముచితములు నని తోఁచినవి సరియైన పాఠములుగా గ్రంథము నందు గహింపఁ బడినవి. పూర్వ పాఠములు వావిళ్ళ1926. అను సూచనతో పుట యడుగునఁ జూపఁబడినవి. కొన్ని పదములకు మాత్రము అర్ధము తెలుపఁబడినది. ఇఁక యతిప్రాసలు మున్నగువానిలోఁ జేయఁబడిన ముఖ్యమగు సవరణలు కొన్ని యిటఁ దెలుపబడుచున్నవి.

సవరణలు :

1. ఆశ్వాసాంత గద్య.

“ఇది శ్రీ మదఖిలకవిమిత్ర పెద్దయన్నయామాత్యపుత్ర
..............జక్కన నామధేయ....

అని పూర్వముద్రితగ్రంథముల ఆశ్వాసాంతగద్యలో కలదు. వావిళ్ళవారి ముద్రణప్రతి పీఠికలో శ్రీ బులుసు సీతారామశాస్త్రిగారు “జక్కన పేరయాన్నయామాత్యుని కొడు" కని వాసిరి. ఈ పొరపాటు ఆంధ్రకవులచరిత్రములోని “ఈతని తండ్రిపే రన్నయామాత్యుం" డను దానివలన కలిగిన ట్లూహింపవచ్చును. కాని, యీ రెండును సరియైనవి కావు. కృత్యాదిలో జక్కనయే స్వయముగాఁ జెప్పిన యీ పద్యమును గమనింపుఁడు.

ఆఁడడు మయూరరేఖను
గాఁడం బాఱండు బాణగతి మన మెరియన్