38
పద్యములు మనుచరిత్రము నందలి
అటఁ జనికాంచె భూమిసురుఁ డంబరచుంబిశిరస్సజ్ఝరీ
గటకచరత్కరేణుకరకంపితసాలము శీతశైలమున్.(మను.చ. ఆ.2-3)
కల్పనకు గొంతవఱకు ప్రేరకము లనఁదగియున్నవి. మఱియు జక్కన చేసిన యీక్రింది వరాహవర్ణనము:
కొండొకవాలముం గుఱుచకొమ్ములు, నన్నువలైన వీనులున్
.... .... .... .... .... .... ...
తొండములేని భద్రకరితో నెనయైన వనీవరాహమున్.(ఆ. 3-75)
బలమిఁక నేమి నెప్ప విను పండువెదు ళ్ళవలీల మోరత్రో
... ... .... ... ... .... ..... ...
... ... ... ... .... .... .... ...చప్పరించు, న
ప్పోలము వరాహపోతములు భూవర తొండములేని యేనుఁగుల్.(మను.చ. ఆ. 4-18)
అను పెద్దన పద్యమునకు మూలప్రాయముఁగ నున్నది.
ఏనుబొత్తుకు రాక యెన్నఁడు నారగిం
పనియట్టి భక్తి మజ్జనకుఁ దలఁచి
చెమట నెత్తురుగాఁగఁ జిత్తమ్మునఁ దలంచి
యర్మిలిఁ బెనుచు మదంబఁ దలఁచి
నిముసంబుననుఁ బాసి నిలువక యొడఁగూడి
చరియించు మత్రాణసఖులఁ దలఁచి
గంధసింధురసైంధవోత్కరముఁ దలఁచి
సతత సేవాగతనరేంద్రవితతిఁ దలఁచి
వనట యొదవిన నింత యొప్పని మనమున
నున్నచందంబుగాని వేఱొండు లేదు.(వి.చ. ఆ. 6-59)
ననునిముసంబు గానకయున్న నూరెల్ల
నరయు మజ్జనకు డెంతడలునొక్కొ!
యెపుడు సంధ్యలయందు నిలువెళ్ళనీక న
న్నోమెడుతల్లి యెంతొఱలు నొక్కొ!
యనుకూలవతి నాదు మనసులో వర్తించు
కులకాంతమది నెంత కుందునొక్కొ!
కెడఁదోడు నీడలై క్రీడించు సచ్ఛాత్రు
లింతకు నెంత చింతింతురొక్కొ!(మను.చ. ఆ. 2-17)