పుట:విక్రమార్కచరిత్రము.pdf/36

ఈ పుట ఆమోదించబడ్డది

35

బాయని కాముకుల్ వెలుకఁబాఱి కలంగఁగ మ్రోసెఁ 'గొక్కొరో
కో'యని కుక్కుటస్ఫురదకుంఠితకంఠకఠోరనాదముల్.(ఆ. 6-73)

రోదనవర్ణన:

పుటపుటనగు చనుఁగవపై
బొటపొటఁ గన్నీరు దొరఁగఁ బురపురఁ బొక్కం
దటతట గుండియ లదరఁగఁ
గటకట యిది నోముఫలము గాకేమనుచున్.(ఆ. 7-153)

భోజనపదార్థవర్ణన.

మించుకన్నులు గోరగించు రాజాన్నంబు
        నుపమింపరాని సద్యోఘృతంబు
నమృతోపమానంబులగు పిండివంటలు
        నుజ్జ్వలంటై యొప్పు నొలుపుఁ బప్పు
మదికింపుఁ బెంచు కమ్మని పదార్థంబులు
        బహుపాకరుచులైన పాయసములుఁ
దగువాసనావాసితములైన పచ్చళ్ళు
        వడియఁ గట్టిన యానవాల పెరుగు
సరసమధుర రసావళి సముదయములు
పంచసార సమంచిత పానకములుఁ
గమ్మకస్తురి నెత్తావిఁ గైపుచేసి
యూరుఁగాయలు జల్లని యుదకములును.(ఆ. 4-188)

ఇట్టి వర్ణన లెన్న నియుఁ గలవు. ఇవి యన్నియు శ్రీనాథయుగకావ్యము లన్నిఁటను సర్వసాధారణముగాఁ జూడనగును. పెద్దనాదు లగు ప్రబంధకవులును వీని నాదరించి రని చెప్ప నవసరము లేదు. ఇట్టి వర్ణనమును జక్కని ప్రబంధశయ్యతో నానాశబ్దాలంకారపౌష్కల్యముగా జక్కన గావించెను.

జక్కన రచనయం దెడనెడ కవిత్రయము కవితాప్రభావము ముఖ్యముగ గోచరించును. నన్నెచోడ, నాచనసోమ, హళక్కి భాస్కరుల పోకడలును గొన్ని కనవచ్చును.

పూర్వుల ప్రభావము జక్కన పై దోచునట్లే, తర్వాతి కవులు కొందఱపై జక్కన ప్రభావము స్పష్టముగా గోచరించు. జక్కన కవిత్వము చేతఁ బ్రభావితు లయిన వారిలోఁ బెద్దనామాత్యుండును చేమకూర వేంటకవియును ముఖ్యులు. కొన్ని సామ్యము లీ దిగువఁ జూపఁబడును.