పుట:విక్రమార్కచరిత్రము.pdf/34

ఈ పుట ఆమోదించబడ్డది

33

యాగమోచితముగా నవయవంబులయందు
        లలితరుద్రాక్ష భూషలు వహించి
పొంబట్టు పుట్టంబు పొట్ట నందంబుగా
        ఘనాజటాజూటంబు గలయఁ బొదివి
యడుఁగుఁ గెందమ్ముల బెడఁగు రెట్టింపఁగాఁ
        గాంచనమణిపాదుకములు దొడిగి
జమిలి మొలతాట నినుపకచ్చడ మమర్చి
కక్కపాలయుఁ గక్షభాగమునఁ బూని
తరుణ శశిమౌలి యపరావతార మనఁగ
ధరణిపతి పాలి కేతెంచెఁ దపసి యొకఁడు.(ఆ. 2-97)

వృద్ధవిప్రవర్ణన.

పటలికావృతనేత్రపర్యంతరేఖలు
        పొదవికై వ్రాలిన బొమలతోడ
దంతపాతముల నెంతయు స్రుక్కిన కపోల
        తలముల నెలకొన్న వలులతోడ
నవగతకేశోత్తమాంగంబు కెలఁకులం
        దూగాడు నరపవెండ్రుకలతోడఁ
గ్రౌంచకంఠోపమాకారతఁ గనుపట్టు
        నస్నిగ్ధమైన దేహంబుతోడ
శతశతచ్ఛిద్రజీర్ణవస్త్రములతోడ
కల్పతతరపర్వయుతవంశయష్టితోడ
హరిసహస్రనామోచ్చారణరతితోడ
వచ్చి యొకవృద్ధభూసురవరుఁడు గదిసి.(ఆ. 2-117)
పలుకనిమోముఁ దొట్రుపడు పాదములున్ వగరంపుటూర్పులున్
వలవలనైన దంతములు వంగిన మేను వణంకు మస్తమున్
నిలుపఁగరాని యుక్కిసయు నెమ్మెయి నెక్కొను దప్పి పెంపుఁ జే
వెలుఁగునఁ జూచుచూపుఁ గల వృద్ధమహీసురుఁ డమ్మహీశ్వరన్.(ఆ. 2-155)

పాతాళరాజకన్యకవర్ణనము :

చిన్నారిపొన్నారిచెక్కుటద్దములపై
        జిఱునవ్వుమొలకలు చెంగలింప
మదనుని తూపుల మఱపించు చూపుల
        తెఱఁగుల మెఱుఁగులు తుఱఁగలింప