పుట:విక్రమార్కచరిత్రము.pdf/332

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

విక్రమార్కచరిత్రము


మగనిదిక్కు మొగంబుగా మంతనంబు
మాటగా నిట్టు లనియె నమ్మాయజోటి.

96


తే.

ఇంపు లొదవంగ నేను నాయింతి గూడి
యాలిమగనాట లాడుదు మాదికాల
మిప్పు డిది చూతుగాక నీ వెఱుఁగునట్లు
కన్నుమూసినవిధమునఁ గదలకుండు.

97


వ.

అనుచు నాభద్రేభగమన ముద్రవెట్టి కపటనిద్రాముద్రితుం జేసి సమున్నిద్రాతిశయరతితంత్రస్వతంత్రమర్మసమరత్యుపరతులఁ బుష్పకరండకునిఁ బుష్పకోదండక్రీడం దేల్చిన నతండు లీలావతీవిలాసినీకుహనాచాతురీధురీణత్వంబునకు వెఱఁగుపడియె నంత నరుణోదయప్రకటకుక్కుటకంఠకఠోరనిర్గళన్నిరర్గళాత్యంతభయంకరారవంబు వీతెంచిన నుదరిపడి లీలావతీకాంత నిజకాంతునికిఁ దెలిపి పద్మావతీప్రయాణం బెఱింగించి యతనిచేత ననిపించి తానును గొంత దవ్వరిగి పునఃపునరాలింగనంబు చేసి మఱవకుండు మని పద్మావతీనామాభిరామ పరిహాసవిహారుండగు నప్పుష్పకరండకునిం దగులాగున వీడుకొలిపి శయ్యకుం జని యాశ్చర్యకరుండైన మగనిమనసు తదవసరోచితక్రియలం బడసె నని ప్రతాపార్కుండైన విక్రమార్కునకు సువర్ణకుంభంబు మనోహరకథావిధానంబు పరిపూర్ణంబుగా నెఱఁగించి యిట్లనియె.

98


క.

ఏవిన్నపంబు చేసిన
యీ వెలఁదులలోన జాణ యెవ్వతె? యనుచుం
దా వేడుక నడిగిన బ
ద్మావతి యని పలికె నతఁడు మందస్మితుఁడై.

99


వ.

పలికినం గోపించి.

100


సీ.

చెక్కులందు నివాళి సేయు లేనగవులు
        తాటంకరుచి కొల్లకోటు సేయ
జిగి ధగధ్ధగయను బిగువుఁజన్నులమీఁదఁ
        క్రొమ్మించుసరులు త్రోద్రోపులాడ