పుట:విక్రమార్కచరిత్రము.pdf/321

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

273


దలసత్వ ముడిగి చను మని
పలికిన, నది చనియె జారపతి యున్నడకున్.

37


క.

చని సరసవచనరచనలఁ
జనవులఁ బరిరంభణాదిసంభావనలన్
మనసు గరఁగించి, పులకలు
తనువునఁ బొదలించి, రతులఁ దగిలించి తగన్.

38


సీ.

త్రుళ్ళుమింతలు వెట్టు తొడలదీప్తులతోన
        చనుదోయిమించులు చౌకళింప
రాణించు నందెలరవళితోడనె కూడ
        మొలనూలి మువ్వలమ్రోఁత నిగుడ
గటితటంబునఁ దోఁచు కదలు పెక్కువతోడఁ
        గర్ణభూషణములకదలు మెఱయఁ
గడలేని సుఖములఁ గరఁగిన మదితోడఁ
        జిత్రకస్ఫూర్తి లేఁజెమట గరఁగ


తే.

వదలుక్రొమ్ముడి యలరులవానఁ గురియ
హారమణిదీప్తి యుయ్యలలాడుచుండ
మగువ పుంభావలీలల మాఱుమగనిఁ
గంతుసామ్రాజ్యలక్ష్మికిఁ గర్తఁ జేసె.

39


వ.

ఆ పుష్పకరండకుండును సంతోషితస్వాంతుండై.

40


చ.

పురిఁ బురిఁ దప్పకుండ, మొలపూసలు ద్రెవ్విననాఁట నుండియుం
దిరిగితిఁ బెక్కుభూములు సతీ! రతిసౌఖ్యరసప్రసంగవి
స్ఫురణల తారతమ్యములు చూచితిఁ గాని, భవత్సమాన లే
తరుణులుఁ గారు భావభవతంత్రకళాకలనాచమత్కృతిన్.

41


వ.

అనవుడుఁ బద్మావతి మదీయచాతుర్యంబునకు నాశ్చర్యంబందనేల యని యిట్లనియె.

42