పుట:విక్రమార్కచరిత్రము.pdf/320

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

విక్రమార్కచరిత్రము


ఫలరసంబులు క్రోల్చి పతుల నిక్కకుఁ బిల్చి
        కొనిపోవు కీరకామినుల బెడఁగు
బిసములఁ దనియించుప్రియులతో విహరించి
        యలరు రాయంచతొయ్యలుల చెలువుఁ
బల్లవంబులు దెచ్చి ప్రాణేశ్వరుల కిచ్చి
        చెలఁగెడు కోకిలస్త్రీలమురువు


తే.

నెలమిఁ గొనియాడి, యాత్మేశు నియ్యకొల్పి
యతఁడు నతనుండుఁ గార్ముకహస్తు లగుచు
దోడఁ జనుదేర, జారనాథుఁడు వసించు
నువవనాంతరభూమికి నువిద చనియె.

32


క.

చని యాదంపతు లాత్మల
ననురాగరసంబు నిండి యలువులువాఱన్
వనకేలీతత్పరులై
వినుతవిహారములఁ దగిలి విహరించుతఱిన్.

33


క.

పదములు తొట్రుపడంగా
వదనంబున లేనిదప్పి వాతెఱ యెండం,
గదియఁగ వచ్చి వసంతుఁడు
హృదయమున భయంబుదోఁప నిట్లని పలికెన్.

34


చ.

కడు వెర వేది నేఁ, బ్రథమగర్భవతిన్ సతిఁ బుట్టినింటికిం
దొడుకొనివచ్చుచో; నిచట దుస్సహ మైన ప్రసూతివేదనం
బడియెడు, నియ్యెడం దగినబాసట లే; దటుగాన నింక నీ
పడఁతుక చిత్త మాపడతి భాగ్యము, మాటలు వేయు నేటికిన్.

35


వ.

అనుటయు వానిదీనాలాపంబులకు బ్రమసి పద్మావతీరమణుండు పద్మావతిం జూచి యిట్లనియె.

36


క.

జలజేక్షణ యెవ్వరికిం
గలసంసారము నుపేక్ష గావించుట గా,