పుట:విక్రమార్కచరిత్రము.pdf/317

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

269


చ.

సరసవినూత్నరత్నరుచిజాలముచేఁ దులకించుచున్న యా
గురుకుచక్రొమ్మెఱుంగుఁజనుగుబ్బలతో సరిచేయవచ్చునే,
తొరలి హిరణ్యకుంభముల దొడ్డతనంబులు చెప్ప నేటికిన్,
గురుత య దేల కల్గు గుడిగుండములం బడునట్టివారికిన్?

15


చ.

వరుఁడు ధనుర్ధరుం డయి దివానిశమున్ వెనుకం జరింపఁగా
వెరవున మోసపుచ్చి, తనవేడుకవచ్చినయట్టివారితో
సరసరతిప్రసంగములు సల్పఁగ నేర్చుఁ, దదీయనైపుణ
స్ఫురణముచంద మెందును నపూర్వము! చూడఁగఁ బొమ్మ గ్రక్కునన్.

16


వ.

అనుటయు.

17


చ.

చెలఁగి కటారిబిత్తరము చిమ్ము వికారపునవ్వు నవ్వు, మీ
పలు వడివెట్టు నూరక, 'మజా' యనుఁ 'దన్నన'యంచుఁ బాడుఁ గ
న్నులు వెసఁ ద్రిప్పు కొప్పుపయి నున్నగ దువ్వు, బళాలు వెట్టు, మూఁ
పులు పలుమాఱుఁ జూచుకొనుఁ బుష్పకరండకుఁ డాత్మ నుబ్బుచున్.

18


పద్మావతి కథ

ఉ.

క్రన్నన వారి వీడుకొని, కన్నుల మ్రొక్కి, వెసం దలారి యై
క్రొన్ననవింటఁ దేఁటిగఱికోల యమర్చి మరుండు వెంట రా;
మున్నుగ నెమ్మనంబు తన ముందటిచక్కని ద్రోవవెట్టఁగాఁ,
గన్నియయూరి కేఁగెఁ దమకంబునఁ బుష్పకరండకుం డొగిన్.

19


వ.

అరిగి మహాఘోషపురవరోపాంతంబున, శశికాంతశిలాతలంబునఁ బథిశ్రమం బార్చుకొని, తదవసరోచితాలంకృతుండై యన్నగరంబున కరిగి, మనఃపద్మసద్మయగు నప్పద్మగంధిమందిరంబు పౌరజనంబులవలన నెఱంగి, మందమందగతిం జని తన్నికేతనంబు ప్రవేశించి.

20


ఉ.

ప్రాకటహేమరత్నమయపంజరపీఠికలన్ శుకంబు ల
వ్యాకులలీలతో రతిరహస్యవికాసకళావిలాసకొ
క్కోకము లర్థితోఁ జదువఁ గూరిమితో వినుచున్, సురూపరే
ఖాకమనీయతామహిమఁ గామునిదీమముఁబోలె ముందటన్.

21