పుట:విక్రమార్కచరిత్రము.pdf/31

ఈ పుట ఆమోదించబడ్డది

30

సహకారఫలరసాస్వాదన సంతుష్ట
        శుకసతీపతిరుతి ప్రకటనములఁ
గిసలయాంకుర రసగ్రసన సముత్కంఠ
        కలకంఠ విటవిటీ కలకలములఁ
గనియు వినియు వసంతసంక్రాంతరాగ
సర్వసామాన్యమహిమ కాశ్చర్యమంది
చెలి కెఱింగించి కొనియాడి చెప్పి చెప్పి
ప్రమదవనకేళిఁ దేలిరి పతియు సతియు.(ఆ. 5.24)

పుష్పాచయము :

అందని పువ్వుగుత్తుదెసకై యఱుసాపఁగ నేల బాల? కో
యందలవయ్యె నేని, నెగయ న్నిను నెత్తెదనంచు, సంతసం
బందఁగ నెత్తియెత్తి విభుఁ డందఱిముందఱ డించుచుండఁగా
నందినకంటె సంతసము నందె లతాంగియు మాటిమాటికిన్. (ఆ. 5–27)

జలకేళి :

ఆ నెలతల్ సరోజినికినై దిగునప్పుడు నూత్నరత్నసౌ
పానములం దదీయతను బంధురబింబము లుల్లసిల్లెఁ దే
జోనిధియైన యానృపతి సోయగముం దరిసించు వేడుకం
బూని జలాధిదేవత లపూర్వగతిం జనుదెనించిరో యనన్. (ఆ. 5-45)

మృగమదపంకిలాంగు లొకమే నొకమే ఘనసారచందన
స్థగితలునైన కామినులు సాటిగ నొండొరుఁ జల్లి యాడుచో
సగమున నల్పు దెల్పులగు చాయలు సెందిఁ గళిందకన్యకా
గగననదీ సమాగమముకైవడిఁ బద్మిని యొప్పె నత్తరిన్. (ఆ. 5–47)

[1]

నెలతలు కంఠదఘ్నమగు నీరవిహార మొనర్ప నిల్చినం
గొలను తదాసనస్ఫురణం గ్రొత్తమెఱుంగు వహించెఁ బెక్కుత్రి

 
  1. ఒక్క చంద్రునిఁ గన్న సముద్రుని, ననేక చంద్రులఁ గని మించుట యనుభావము సంస్కృత శాసనపద్యమునం గన్పట్టుచున్నది.
    శ్లో॥ యఃప్రోత్తుంగతరంగసంగతిభవద్దిండీరపిండచ్ఛలాత్
         తీరేతారతరేందుమండలమయీంమాలాం సదోత్పాదయన్
         భ్రామ్యన్ మందరమంథమంథన వశాదేకేదు సంభూతిజం
         క్షీరాబ్ధేరధరీకరోతి పరితఃకీర్తిం జగద్వాపినమ్.

    (కొండిపర్తి శాసనములు. 8. 33-37 పంక్తులు;తెలంగాణా శాసనములు. భా. 1.]