పుట:విక్రమార్కచరిత్రము.pdf/308

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

విక్రమార్కచరిత్రము


గారాముతోడ నాతని
నారామంబునకుఁ దేఁ బ్రియంబునఁ బనిచెన్.

145


ఉ.

పంచిన, భూసురోత్తముని పాలికి నేఁగి, ప్రియంబు చెప్పి రా
వించి, నవీనచంచదరవిందమరందవిలోలచంచరీ
కాంచితదీర్ఘికాతటవనాంతరసీమ వసింపఁజేసి, తా
నించిన వేడ్కతో మగుడ నేఁగి కుమారికతోడ నిట్లనున్.

146


ఉ.

భూసురవర్యుఁ దెచ్చితి, నపూర్వవనాంతలతాంతశయ్యకున్
భాసురరూపసంపదల బ్రాఁతిగ నాతని భావసంభవుం
ద్రాసునఁ దూన్పవచ్చు, ననురాగరసాంబుధి నోలలాడు, నీ
చేసినభాగ్య మెవ్వరును జేయరు తోయజపత్త్రలోచనా.

147


క.

అని యాసీమంతిని మం
తనమున నుపకాంతు నువవనంబున కైతె
చ్చినవార్త విన్నవించిన
విని కౌఁగిటఁ జేర్చి గారవించెం బ్రీతిన్.

148


క.

అంతటిలోపల నపరది
గంతమునకు భానుమంతుఁ డరుగుటయుఁ బటు
ధ్వాంత మనంతంబై హరి
దంతర వియదంతరముల నంతటఁ బర్వెన్.

149


శా.

ఆలో, నీలవినీలకుంతలవిలోలాలీంద్రసాంద్రప్రభా
భీలాకారమహాంధకారము విజృంభింపంగఁ బ్రాణేశు ని
ద్రాలోలాత్మునిఁగా నెఱింగి, విలసత్సౌధంబు పై డిగ్గి, నా
లీలారామములోనికిం జనియె నాళీవంచనప్రౌఢియై.

150


క.

అటమున్న పన్నగేంద్ర
స్ఫుటదంష్ట్రానిష్టుఁ డగుచు భూసురవరుఁ డ
చ్చట మృతుఁ డై పడియుండఁగఁ
గుటిలాలక యిట్టు లనియెఁ గుందుచు నల్లన్.

151