పుట:విక్రమార్కచరిత్రము.pdf/304

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

విక్రమార్కచరిత్రము


తే.

మాయజోగుల కిచ్చి దిమ్మరుల కిచ్చి
మద సానుల కిచ్చి పామరుల కిచ్చి
యెల్లధనమును ధనగుప్తుఁ డెఱుకమాలి
పచ్చపయికంబు లేకుండ వెచ్చపఱచి.

124


క.

రాగతరంగిణి గర్భ
శ్రీగరిమ వహించె ననుచు సీమంతశుభో
ద్యోగము నెపమున, ధనములు
శ్రీగుప్తుని మోసపుచ్చి చేకొనుబుద్ధిన్.

125


క.

కంచికిఁ జని, బహువిభవస
మంచితమగు మేనమామమందిరము ప్రవే
శించి, తనవనితఁ గనుఁగొని
సంచలత వహించి గుండె జల్లన నున్నన్.

126


క.

శంకింపవలదు, పోలఁగ
బొంకితి మును కాననాంతమున మ్రుచ్చులకుం
గొంకి యసహాయతను నే
వంకకు నరిగితివో యనుచు వైశ్యవరేణ్యా.

127


క.

అని రాగతరంగిణి తను
వినయోక్తుల వెఱపు మాన్పి, వేగంబుగ మ
జ్జనభోజనాదిసత్కృతు
లొనరింపఁగ, మామచేత నుపలాలితుఁడై.

128


ఉ.

ఆగుణహీనుఁ డొక్కతటి నర్ధనిశాసమయంబునందు సం
భోగపరిశ్రమస్ఫురణఁ బొంది కవుంగిట నున్నయట్టి యా
రాగతరంగిణీరమణిరత్నసువర్ణవిభూషణాదు లి
చ్ఛాగతిఁ గొంచుఁ బోఁదలఁచి, చంపఁ గఠారము పూన్చెఁ బూన్చినన్.

129


మ.

వనితారత్నము వానికార్యమునకున్ వాపోవ, నచ్చోటికిం
జని శ్రీగుప్తుఁడు తాను బాంధవులు నాశ్చర్యంబు రెట్టింపఁగా