పుట:విక్రమార్కచరిత్రము.pdf/303

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

255


గంధసింధురతురంగములసాహిణములు
        శ్రీకాంత కేకాంతసీమ గాఁగ


తే.

నావణంబులఁ బచరించునట్టిసరకు
లర్థపతివైభవంబుల నపహసింప
రమ్య మై యున్న కాంచీపురంబుతోడ
నితరపురముల నుపమింప నెట్లువచ్చు!

118


వ.

అని ప్రశంసించుచుఁ దత్పురంబు బ్రవేశించి, ప్రతిదినప్రవర్ధమానమహావైభవసుందరం బైనశ్రీగుప్తుమందిరంబుం బ్రవేశించి యతనిని గాంచి.

119


క.

కాంతారాంతరకూపా
భ్యంతరమునఁ గాంతఁ గనుట యాదిగఁ, దా రా
యింతిని గొనివచ్చినవిధ
మంతయు నెఱుగంగఁ జెప్పి యరిగినపిదపన్.

120


వ.

అతండు.

121


క.

ఎల్లింటినేఁటిలోనన
తల్లీ వెదకించి తెత్తు ధనగుప్తుని నీ
వుల్లమున వగపవల దని
చల్లనిమాటలఁ దనూజ సంభావించెన్.

122


వ.

అట ధనగుప్తుండు ధనంబు గొని నిజమందిరమున కరిగి.

123


సీ.

బందికాండ్రకు నిచ్చి పరిహాసకుల కిచ్చి
        కూడియాడెడు ధూర్తకోటి కిచ్చి
కుంటెనీలకు నిచ్చి కోడిగీలకు నిచ్చి
        మిన్నక వారకామినుల కిచ్చి
జూదరులకు నిచ్చి జుమ్మికాండ్రకు నిచ్చి
        జారవిలాసినీసమితి కిచ్చి
యిచ్చగొండుల కిచ్చి యుచ్చమల్లుల కిచ్చి
        వారక యుబ్బించువారి కిచ్చి