పుట:విక్రమార్కచరిత్రము.pdf/298

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

విక్రమార్కచరిత్రము


డావైశ్యవరపుత్త్రుఁ డగు ధనగుప్తుండు
        యీవనోదయదుర్మదాంధుఁ డగుచుఁ
దనతండ్రిపిమ్మట ధనమెల్లఁ బోనాడి
        కడు నకించనవృత్తిఁ గంచి కరిగి


తే.

యందు నిజమాతులోత్తము ననుపమాన
విభవు శ్రీగుప్తుఁ డగు వైశ్యవిభునిఁ జేరి
తండ్రి మృతుఁడౌట చెప్పక తత్తనూజఁ
బరిణయం బయ్యె వైభవస్ఫురణ మెఱయ.

92


వ.

రాగతరంగిణిఁ యను నక్కాంతం బరిగ్రహించి యనంతరంబ.

93


క.

రాగతరంగిణిఁ దన్నును
శ్రీగుప్తుం డొక్కభంగిఁ జేపట్టి బహు
శ్రీగరిమ గారవింపఁగ
రాగిల్లి తదీయమందిరంబున నుండెన్.

94


వ.

అంత.

95


క.

తన ప్రాణము ప్రాణములై
యనవరతముఁ దన్నుఁ గూడి యాడెడుధూర్తుల్
మనసునఁ బాఱిన నూరికి
జనియెద నని మామతోఁ బ్రసంగముచేసెన్.

96


ఉ.

చేసిన, మామ యల్లుని కశేషవిశేషవినూత్నరత్నభూ
షాసముదంచితాంబరలసద్ఘనసారపటీరవస్తువుల్
భాసురలీల నిచ్చి యనుపన్ సతిఁ దొడ్కొని యేఁగి, దుర్మద
శ్రీ సిగురొత్తఁ గాంచనపురీవరకాననమధ్యమస్థలిన్.

97


క.

తనుఁగూడి వచ్చువారలఁ
గనుమొఱఁగి, మహోగ్రవృత్తి ఘనకూపములో
వనితఁ బడఁద్రోచి, తెచ్చిన
ధనమంతయుఁ గొంచు నేఁగెఁ దనపురమునకున్.

98