పుట:విక్రమార్కచరిత్రము.pdf/297

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

249


క.

ఈరాజు రాజముఖియును
గారవమునఁ గలసిమెలసి కందర్పసుఖ
శ్రీరతులై విహరించెద
రీరీతిని మనము నునికి యెంతయు నొప్పున్.

85


క.

అనవుడు శారిక కీరముఁ
గనుగొని. మగవారు ‘పాపకర్ములు నమ్మం
జన’ దనినఁ ‘బాపజాతులు
వనితలుకా’ కనుచుఁ జిలుక వాదముచేసెన్.

86


వ.

తదాకర్ణనకుతూహలాయత్తచిత్తులై మత్తకాశినీమహీవరోత్తములు శారికాకీరంబులందేర నొక్కపరిచారక నియమించి.

87


క.

తెప్పించి వానిఁ గనుఁగొని
యిప్పుడు మీలోన వాద మేటికి మాకుం
జెప్పుం డనినను శారిక
చెప్పదొడఁగె నిందువదనచిత్తం బలరన్.

88


వ.

నన్ను నీరాజకీరంబు తనుఁ బరిగ్రహింపు మనిన.

89


క.

పురుషులు పొలఁతుల యెడలను
బరుషాత్మకు లనుచుఁ జాటిపలికినఁ గినుకం
బురుషులయెడలను బొలఁతులె
పరుషాత్మిక లనుచుఁ జిలుక పలికె నరేంద్రా!

90


వ.

అది యట్లుండె మదీయవచనంబున కనుగుణంబుగా నొక్కకథ చెప్పెద నవధరింపుమని యిట్లనియె.

91


శారిక రాజశేఖరునకుఁ జెప్పిన ధనగుప్తుని కథ

సీ.

అభినవశ్రీలతో నలకాపురంబుతో
        సదృశమై యొప్పుఁ గాంచనపురంబు
అన్నగరంబులోఁ గిన్నరేశ్వరుకంటె
        ధర్మగుప్తుఁడు సముద్దామవిభవుఁ