పుట:విక్రమార్కచరిత్రము.pdf/293

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

245


వగలఁ బొగులంగఁ జూడంగ వలసె మాకుఁ
బులుఁగు ని న్నింతచేసెనే పువ్వుబోఁడి.

62


వ.

అని చింతించి శిశిరోపచారంబులు సేయం దలంచి.

63


సీ.

చేమంతిఱేకులఁ జేసిన పఱపుపైఁ
        దెఱఁగొప్ప నల్లనఁ దెఱవ నుంచి
యందంద డెందంబునందు గంద మలంది
        సిరమైన పచ్చకప్పురము సల్లి
పదపల్లవంబులు పల్లవంబుల నొత్తి
        పుప్పొడి కరముల నప్పళించి
యఱుతఁ గ్రిక్కిఱియ ముత్యములపేరులు వేసి
        పన్నీటఁ గన్నీరు పాయఁ దుడిచి


తే.

చెలికి శిశిరోపచారముల్ సేయఁ జేయఁ
నంతకంతకు మదనాగ్ని యధిక మైన
జెలులు మదిలోన నెంతయుఁ జిన్నవోయి
రాజునకు విన్నవించిరి రమణితెఱఁగు.

64


తే.

విన్నవించిన నారాజు విన్ననగుచు
నిన్నుఁ దోడ్కొనిరమ్మని నన్నుఁ బనిచెఁ
జెప్పనేటికి దేవరచిత్త మింక
మదవతీమణిభాగ్యంబు మనుజనాథ.

65


వ.

అనిన నారాజశేఖరుండు.

66


క.

ఆరాజాననమాటయు
నారాజశుకంబుపలుకు, ననురాగరసాం
భోరాశిసుధాకరరుచి
సారం బై యప్పు డేకసంశ్రిత మయినన్.

67


క.

పలుకులు వేయి యిఁకేటికిఁ
బలుకును బంతంబు నొక్కభంగిగఁ బొసఁగం