28
బడినవి. ఇక జక్కన యొక్క పద్యరచనాపాటవము, వర్ణనావైదగ్ధ్యము, పాండిత్యము, ప్రతిభ, భావనాశక్తి, శబ్దార్ధాలంకారప్రీతి, శేషయమకఘటనానైపుణి మున్నగు కవితాగుణములను స్ఫురింపఁజేయు కొన్ని పద్యములు మాత్ర మిట నుదహరింపఁ బడును. వానిఁ జదివి సహృదయు లగు పాఠకమహాశయులు జక్కన కవితాశక్తి నవగాహనము చేసికొందురు గాక!
వర్షర్తువర్ణము :
ప్రథమోదబిందులఁ బల్లవించె ననంగ
నింద్రగోపద్యుతి నిలఁ దనర్చె
భానుచంద్రుల సూడుపట్టి గెల్చె ననంగఁ
గంధరపటలాంధకార మడరె
జలదానిలంబునఁ బులకించెనో యనఁ
గుటజభూజంబులు కోరగించె
స్తనితమర్దళరవంబునకు నాడె ననంగ
వనమయూరములు నర్తనము చేసెఁ
బాంథజనచిత్తచిత్తసంభవమహాగ్ని
ఘనతరజ్వాలజాలానుకరణనిపుణ
వివిధవిద్యుత్పరంపరావిభ్రమంబు
లఖలహరిదంతరంబుల నతిశయిల్లె.(ఆ. 4-31)
దళితానంతదిగంతమై ఘుమఘుమధ్వానంబు సంధిల్లగాఁ
గలయం జాముల వ్రేలఁ గట్టినటు, లుగ్రవ్యగ్రలీల న్నిర
ర్గళధారాళకరాళమై కురిసె వర్షం బెందు నేయింటివా
రలుఁబొర్గింటికి నేఁగకుండఁగ నహోరాత్రంబుఁ జిత్రంబుగన్.(ఆ. 4 - 32)
గగనరత్నముకట్టు మొగులుతో నుదయించెఁ
జరమదిక్కునఁ దోఁచె శక్రధనువు
పూర్వాపరవ్యాప్తిఁ బొలుపారె జలరేఖ
లాలోలగతివీచె మూలగాలి
మెఱుఁగు మొత్తంబులు మెఱసె నుత్తరమునఁ
గడఁగె దక్షిణపు మేఘముల గములు
ప్రాలేయఖానుండు పరివేషగతుఁ డయ్యెఁ
జాతకంబులు నింగి సంచరించె