పుట:విక్రమార్కచరిత్రము.pdf/283

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

235


జనవు నటించి డగ్గఱినఁ, జయ్యన 'భైరవరక్ష' యంచు నిం
పెనయఁగ యోగినీతిలక మిచ్చె విభూతి నరేంద్రసూతికిన్.

15


వ.

ఇచ్చినం బుచ్చుకొని సుఖాసీనుండై యున్నయవసరంబున.

16


క.

పంజరము వెడలి నరపతి
కుంజరు దీవించి, సరసగోష్ఠి సునీతిన్
రంజింపఁజేసె గీరము
మంజులభాషావిశేషమాధుర్యమునన్.

17


వ.

అనంతరంబ యారాజు రాజకీరాభిలాపగర్భంబులైన సముచితాలాపసందర్భంబు లుపన్యసించిన, నయ్యోగినీరత్నంబు ప్రయత్నపూర్వకంబుగా సర్వంసహాధీశ్వరున కిట్లనియె.

18


క.

అష్టాంగయోగవిద్యా
వష్టంభమువలనఁ, గీరవర వచనసుధా
వృష్టి మదిఁ దొప్పఁదోఁగఁగ
నిష్టము గలిగినను జెల్ల దిది మాకు నృపా!

19


క.

అఱువదినాలుగువిద్యల
నెఱవాది త్రికాలవేది నీ వీచిలుకన్
నెఱవుగఁ జేపట్టిన నది
చెఱకునఁ బం డొదవినట్లు చిరకీర్తినిధీ!

20


ఆ.

రాజయోగ్యమైన రమణీయవస్తువు
యోగిజనులయొద్ద నునికి దగునె?
యవధరింపు మనుచు, నవరత్నపంజరా
నీతమైన చిలుకఁ జేతి కిచ్చె.

21


ఉ.

ఇచ్చిన మూఁడులోకములు నేలినకంటెను సంతసిల్లి దా
నచ్చపలాక్షి వీడుకొని, యద్రిసుతాభవనంబు చేరువన్