పుట:విక్రమార్కచరిత్రము.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

పై పట్టిక వలన అష్టాదశవర్ణనములను జక్కన సుమారు 300 పద్యములలో గావించినట్లు తెలియవచ్చును. వీని యందును వనవిహార, జలవిహార, బుతు, యుద్ధ, పుర, వివాహవర్ణనలు క్రమముగా నుత్తరోత్తరదీర్ఘములు.

ఇతర వర్ణనములు :

స్త్రీ వర్ణనము ; ఆ. 1. 116-119; ఆ. 4. 16-19; ఆ. 5. 169-173; ఆ. 5. 44-49; ఆ.7.36; ఆ. 7. 40-46; ఆ. 7: 53-60; ఆ. 8. 42-46.

రాజవర్ణ నము: ఆ. 1.102; ఎఱకు వర్ణనము ఆ. 1.23; వృద్ధ బ్రాహ్మణవర్ణనము ఆ, 2-117, 155; నారదవర్ణనము ఆ. 4-3; విప్రకుమారవర్ణనము ఆ. 7.43; విటవర్ణనము ఆ. 8-6,7; ఇవిగాక తాపసులు, రాక్షసులు మున్నుగాఁ గల పురుషవర్ణన లనేకము గలవు.

వరాహవర్ణనము . ఆ. 2. 125, 126; 133; ఆ. 3.75

నాట్యవర్ణనము. ఆ. 2. 89, 91

అశ్వమేధయాగవర్ణనము : ఆ. 5.93-136

పరిమళవాయువర్ణనము : ఆ. 6.53

కోడికూత. ఆ. 6.73

యోగినీవర్ణనము : ఆ. 7.14

శుకవర్ణనము : ఆ. 7.26

భోజన వర్ణనము. ఆ. 4-188

రోదనవర్ణనము : ఆ. 7.153

పుణ్యతీర్థక్షేత్రదేవతావర్ణనము : కాశీవర్ణన ఆ. 2. 189-194; శ్రీశైలవర్ణనము ఆ. 2. 198-206; అహోబలము ఆ. 2. 208.212 మఱియు కాళహస్తి, శ్రీరంగము, అనంతశయనాది పుణ్యక్షేత్రవర్ణనము లిందు భక్తిరసప్రధానముగఁ జేయఁబడినవి. హేమకూట విరూపాక్ష వర్ణనములు నిందు గలవు. ఇందలి యీ ఘట్టములు పండితారాధ్యచరిత్ర, నృసింహపురాణ, కాళీఖండ, కాళహస్తిమహాత్మ్య, పాండురంగమాహాత్మ్యాదులలోని వర్ణనలను దలఁపునకుఁ దెచ్చును. ఇట్టి వర్ణనలచేత జక్కన తన కావ్యమునఁ బవిత్రవాతావరణమును సృష్టించెను. నన్నెచోడుని వలెనే దీనిని జక్కన శ్రీకారముతోఁ బ్రారంభించి 'మంగళమహశ్రీ' వృత్తముతో ముగించుట గమనింపఁదగియున్నది.

ఇతరవర్ణనలలో ముఖ్యము లని భావించినవి మాత్రమే యిచటఁ దెలుపఁ