పుట:విక్రమార్కచరిత్రము.pdf/277

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

229


క.

కడచిరి నలువురు వహ్నిని
బడి యొక్కట నేను చూడ, బ్రదికించెద ని
ప్పుడు వీరి ననుచుఁ దానొక
పడఁతుక మేనను వసించి పల్కినమాత్రన్.

132


క.

వెలఁదియు ధరణీవిభుఁడును
వెలయాలును దాసిఁ గూడి విమలాకృతులై
వెలువడిరి యగ్గిగుండము
జలరుహషండముననుండి చనుదెంచుగతిన్.

133


వ.

తదనంతరంబ ధర్మధ్వజుతనయ తనప్రాణేశ్వరు నింగితం బెఱింగి యిట్లనియె.

134


ఉ.

కారణ మేమి ‘నా యుసుఱు గల్గిన సర్వము గల్గు’ నాక, తా
వారవధూటి యయ్యు ననివారణదారుణవహ్నికుండ మీ
ధారుణి మెచ్చ మీవెనుకఁ దానును దోడనె చొచ్చెఁ, గాన నీ
వారిజనేత్ర మీకృప కవశ్యముఁ బాత్రము సేయఁగాఁ దగున్.

135


వ.

అనినం గామమంజరీసముచితాలాపంబులకు సంతుష్టాంతరంగుండై హేమాంగదుండు విలాసవతిం దోడ్కొనిపోవుకౌతుకంబును దాని తల్లిదండ్రుల కెఱింగించి, వారల నుచితసత్కారంబులఁ బరితోషితులం జేసి యనంతరంబ.

136


క.

రమణులు శిబికారోహణ
రమణీయత మెఱసి కొలిచి రాఁగా, ధరణీ
రమణుఁడు నిజపట్టణమున
కమరేంద్రాయుధము నెక్కి యరిగెం బ్రీతిన్.

137


క.

అని యిట్లు దివియగంబము
జనవినుతరసప్రసంగసంగతరచనా
జనితకథామధుధారల
మనుజేంద్రుని చెవులఁ జవులు మరగించి తగన్.

138