పుట:విక్రమార్కచరిత్రము.pdf/270

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

విక్రమార్కచరిత్రము


దూరాపాతనాద్యనేకధనుర్విద్యాకౌశలంబులు మెఱయుచుఁ బెద్దయుం బ్రొద్దు మహాయుద్ధంబు సేయుచున్న సమయంబునఁ, గామమంజరి నితిధ్వజునిరథరథ్యసారథుల లీలవోలె నాభీలభల్లంబులు పె ల్లేసి పొడిచేసి పేర్చిన, నతండు విరథుండయ్యును బొలిపోవనిబలిమి నతినిశితవిశిఖంబులు వఱపిన, నత్తన్వి కుముదలోచన యయ్యును గోపావేశంబున నరుణాబ్జపత్త్రనేత్రయై యతనికోదండంబు తుండంబులు చేసి మఱియును.

88


తే.

ఎత్తనెత్తంగఁ జాపంబు లెన్నియేనిఁ
దోడుతోడనె దునుమాడి తోయజాక్షి
తోమరము వైవ నడుమన త్రుంచివైచెఁ
గుంత మెత్తినఁ బొడిచేసెఁ గుంత మెత్తి.

89


వ.

ఇవ్విధంబున.

90


క.

ఆహవమునఁ దరుణీమణి
బాహాటోపమున సైన్యపతిఁ దూలించెన్
సాహసము షడ్గుణం బని
యూహింపఁగ సతుల కెందు నుచితమ కాదే.

91


వ.

ఇట్లు వికలసకలాయుధుండై సేనానాయకుండు.

92


క.

కనుకనిఁ బఱచిన, నాతని
వెనుకొనుటయు, వాఁడు శరణు వేఁడినమాత్రం
గినుక యుడిగి తొయ్యలి మదిఁ
గనికరము జనింప మగిడెఁ గాంతునికడకున్.

93


ఉ.

అంతట మేలుకాంచి వికచాబ్జముఖిం దురగంబు గానమిం
జింత జనింప నున్న నృపసింహుఁడు, గాంచె హయాధిరూఢయై
సంతసమార వచ్చిననిజప్రియకారిణి, నుగ్రసంగర
శ్రాంతశరీరిణిన్, మహితసజ్యశరాసనబాణధారిణిన్.

94